ఓవ‌ర్సీస్‌లోనూ మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు క‌లెక్ష‌న్ల మోత‌- చిరంజీవి మూవీ అదుర్స్‌- అనిల్ రావిపూడి కొత్త రికార్డు

మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. తన కెరీర్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 

Published on: Jan 29, 2026 11:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ బాస్ గా నిలుస్తున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు.

మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి (x/GoldBoxEnt)
మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి (x/GoldBoxEnt)

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాస్ వసూళ్లు రూ.350 కోట్లు దాటాయి.

ఓవర్సీస్ వసూళ్లు

విదేశాల్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ అదరగొడుతోంది. ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.41 కోట్లు)కు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘‘మన శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ కలెక్షన్లు 4.5 మిలియన్ డాలర్లు దాటాయి. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కోసం టికెట్లు బుక్ చేసుకోండి’’ అని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.

అనిల్ రావిపూడి రికార్డు

ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన రీజినల్ సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. ఇప్పుడీ మూవీతో డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ కెరీర్ లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. త్వరలోనే ఇది విదేశాల్లో 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశముంది.

మన శంకర వరప్రసాద్ గారు గురించి

ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరీన్ తదితరులు నటించారు. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది. బ్లాక్ బస్టర్ టాక్ తో మన శంకర వరప్రసాద్ గారు దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. ఓ కేంద్ర మంత్రి రక్షణ బాధ్యతలను ఆయన చూసుకుంటారు. అయితే తన భార్య, పిల్లలకు అతను దూరమవుతాడు. తిరిగి వాళ్లను చేరుకోవాలని ప్రయత్నిస్తాడు.