రికార్డులు సరెండర్- తమ్ముడు ఓజీ సినిమాను దాటేసిన అన్నయ్య మన శంకర వరప్రసాద్ గారు- చిరంజీవి మూవీ కలెక్షన్ల సునామీ

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం తమ్ముడు పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది.

Published on: Jan 28, 2026 10:11 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ మన శంకర వరప్రసాద్ గారు దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. 15 రోజులైనా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను అన్నయ్య చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు దాటేసింది.

మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేశ్
మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేశ్

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

రికార్డులు సరెండర్

చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఈ చిత్రం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లు రాబట్టిందని సోషల్ మీడియాలో ప్రకటించింది.‘బాస్ వచ్చినప్పుడు రికార్డులు లొంగిపోతాయి' అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

‘‘మెగాస్టార్ చిరంజీవి తన రికార్డుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో మరో చరిత్రాత్మక మైలురాయిని నెలకొల్పారు. మన శంకర వరప్రసాద్ గారు 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్. అనిల్ రావిపూడి ఎంటర్‌టైనర్' అని పోస్టు పెట్టారు.

ఓజీని దాటేసి

ఈ వసూళ్లతో పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా జీవితకాల కలెక్షన్లను 'మన శంకర వరప్రసాద్ గారు' అధిగమించింది. సుజీత్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ 2025లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సక్నిల్క్ ప్రకారం ఈ చిత్రం రూ.295.22 కోట్ల వసూళ్లు రాబట్టింది.

మన శంకర వరప్రసాద్ గారు గురించి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు తెరకెక్కింది. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్ తదితరులు నటించారు. జనవరి 12న రిలీజైన మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. రీసెంట్ గా సండే, రిపబ్లిక్ డే హాలీడేస్ రావడంతో మరోసారి కలెక్షన్లు పుంజుకున్నాయి.

ఈ సినిమాలో ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిరంజీవి నటించారు. కేంద్రమంత్రి సెక్యూరిటీని చూసుకుంటారు. అయితే తన భార్యతో విడిపోయి, పిల్లలకూ దూరంగా ఉంటాడు. మరి మళ్లీ అతను తన భార్యాపిల్లలను కలిశాడా? ఇందులో విక్టరీ వెంకటేశ్ పాత్ర ఏంటీ? అన్నది మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూడాల్సిందే.