మీ వల్లే అలాంటివి జరుగుతాయి.. ఇండస్ట్రీ అద్దంలాంటిది.. నా కూతురే ప్రత్యక్ష సాక్ష్యం: క్యాస్టింగ్ కౌచ్పై చిరంజీవి
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో అసలు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉండదని స్పష్టం చేశాడు. ఇక్కడైనా ఎవరైనా రాణించగలరని, అందుకు తన కూతురు సుష్మితనే సాక్ష్యమని అన్నాడు.
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో ఈ హాట్ టాపిక్ పై చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమీ ఉండవని, అది మీ ప్రవర్తనను బట్టే ఉంటుందని అనడం గమనార్హం.

క్యాస్టింగ్ కౌచ్పై చిరంజీవి ఏమన్నాడంటే?
మన శంకరవరప్రసాద్ గారు మెగా బ్లాక్బస్టర్ కావడంతో హైదరాబాద్ లో ఆదివారం (జనవరి 25) రాత్రి సక్సెెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మాట్లాడాడు. తన కూతురినే ఉదాహరణగా చెబుతూ.. ఇక్కడ ఎవరైనా రాణిస్తారని అన్నాడు.
“ఇండస్ట్రీలో ఆడయినా, మగయినా రాణించాలంటే కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు.. ఎవరైనా నెగటివ్ పీపుల్ ఉన్నారు.. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటే అది నీ తప్పిదం అవుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్ గా ఉండి, సీరియస్ గా ఉంటే ఎవడూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించడు. క్యాస్ట్ కౌచ్ లాంటివేమీ ఉండవు. నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది. నీ అభద్రతాభావమది. అలాగే ఉండాలేమో అనుకుంటారు. కానీ అలా కాదు. నువ్వు ప్రొఫెషనల్ గా ఉండు.. అవతలి వాళ్లు ప్రొఫెషనల్ గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అద్దంలాంటిది. నువ్వు ఏమిస్తావో.. నీకు తిరిగి అదే వస్తుంది. ఇండస్ట్రీలోకి రావాలంటే కృత నిశ్చయంతో, హార్డ్ వర్క్ నమ్ముకొని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు రాణిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత. అలాగే దత్తుగారి పిల్లలు స్వప్న దత్ లాంటి వాళ్లు కూడా” అని చిరంజీవి అన్నాడు.
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ కలెక్షన్లు
చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. 14 రోజులు అయినా కూడా తగ్గేదే లేదంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్ల దిశగా వెళ్తోంది. రెండో ఆదివారం కూడా బుక్ మై షోలో లక్షా 21 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్ల మూవీగా నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


