జన నాయగన్ కోసం దళపతి విజయ్ రికార్డు బ్రేకింగ్ రెమ్యునరేషన్.. ఊహకందని రీతిలో..

దళపతి విజయ్ తన చివరి సినిమా కోసం రికార్డు బ్రేకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు రిపోర్టులు వెల్లడించాయి. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి మూవీ అని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

Dec 19, 2025, 18:22:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా ప్రచారం జరుగుతున్న 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

జన నాయగన్ కోసం దళపతి విజయ్ రికార్డు బ్రేకింగ్ రెమ్యునరేషన్.. ఊహకందని రీతిలో.. (PTI )
జన నాయగన్ కోసం దళపతి విజయ్ రికార్డు బ్రేకింగ్ రెమ్యునరేషన్.. ఊహకందని రీతిలో.. (PTI )

ఊహకందని రెమ్యునరేషన్

దళపతి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు నటిస్తున్న చివరి పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పింక్‌విల్లా రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా కోసం విజయ్ రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకున్నాడు. జన నాయగన్ కోసం ఏకంగా రూ. 275 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇది కేవలం రెమ్యునరేషన్ మాత్రమే. ఇక సినిమా లాభాల్లో అతనికి ఎలాంటి వాటా ఉండదు.

తన గత చిత్రం 'ది గోట్' కోసం విజయ్ సుమారు రూ. 200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ రికార్డును అతడు బ్రేక్ చేయడం విశేషం.

జన నాయగన్ మూవీ గురించి..

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నిర్మిస్తున్న ఈ జన నాయగన్ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్

విడుదలకు ఇంకా సమయం ఉన్నా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది. యూకే (UK)లో బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే 12,700 టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో విజయ్ సినిమా 'లియో' (Leo) పేరిట ఉన్న 10,000 టికెట్ల రికార్డును ఇది అధిగమించింది.

డిసెంబర్ 18న విడుదలైన రెండో సింగిల్ "ఒరు పేరే వరలారు" (Oru Pere Varalaaru) పాటకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 51 ఏళ్ల వయసులోనూ విజయ్ ఎనర్జీ, డ్యాన్స్ మూవ్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ పాట విజయ్ పొలిటికల్ జర్నీని, అభిమానులతో అతనికి ఉన్న బంధాన్ని ప్రతిబింబించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 'జన నాయగన్' విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సెండ్-ఆఫ్ మూవీగా నిలిచేలా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More