ప్రభాస్ ది రాజా సాబ్ భారీ రన్ టైమ్.. ఆ రెండు సీన్లు కట్.. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న హారర్ కామెడీ మూవీ
ప్రభాస్ ది రాజా సాబ్ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ భారీ రన్ టైమ్ తో వస్తుండటం విశేషం. అంతేకాదు ఈ హారర్ కామెడీ మూవీలో నుంచి రెండు సీన్లను కట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. మూవీ జనవరి 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేషన్ పూర్తయ్యింది. కొన్ని కీలకమైన కట్స్, మార్పుల తర్వాత సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్ జారీ చేశారు.

ది రాజా సాబ్ రన్ టైమ్, సెన్సార్ కట్స్ ఇలా..
మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా రన్ టైమ్ విషయంలో మారుతి ఏమాత్రం కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు.
ది రాజా సాబ్ సినిమా మొత్తం నిడివి 189 నిమిషాలు.. అంటే 3 గంటల 9 నిమిషాలు కావడం గమనార్హం. హారర్ కామెడీకి ఇది చాలా పెద్ద రన్టైమ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నుంచి రెండు కీలకమైన కట్స్ సూచించారు.
ఇందులో నేలపై రక్తాన్ని కడిగేసే 35 సెకన్ల విజువల్స్ మరీ వయొలెంట్ గా ఉండటంతో.. దాన్ని బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చాలని సూచించారు. ఒక తల నరికే 4 సెకన్ల ఫ్లాష్ విజువల్ను పూర్తిగా తొలగించమని చెప్పారు. మేకర్స్ ఈ సీన్ను తీసేశారు. తన అమ్మమ్మను కాపాడుకోవడం కోసం ఒక దుష్ట ఆత్మతో పోరాడే మనవడి కథే ఈ ది రాజాా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటించారు.
సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ఇలా..
2026 సంక్రాంతికి థియేటర్ల వద్ద గట్టి పోటీ ఉంది. 'ది రాజా సాబ్'తో పాటు బరిలో ఉన్న సినిమాలు ఏవి, ఎప్పుడు రిలీజ్ కానున్నాయో చూడండి.
జనవరి 9: విజయ్ చివరి మూవీ 'జన నాయకుడు' (తమిళంలో జన నాయగన్)
జనవరి 10: శివకార్తికేయన్ ‘పరాశక్తి’
జనవరి 12: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’
జనవరి 14: నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


