ది రాజా సాబ్ కోసం ఏపీలో అత్యంత భారీగా పెరిగిన టికెట్ల ధరలు.. స్పెషల్ షోలకు ఏకంగా రూ.1000
ది రాజా సాబ్ మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీగా టికెట్ల ధరలు పెరిగాయి. ఈ మేరకు బుధవారం (జనవరి 7) అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెషల్ షోలకు అయితే ఏకంగా రూ.1000గా నిర్ణయించడం విశేషం.
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ టికెట్ల ధరల పెంపు సాధారణం కంటే కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అవి ఎలా ఉన్నాయో చూడండి.

ది రాజా సాబ్ టికెట్ల ధరలు
ది రాజా సాబ్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం (జనవరి 7) సాయంత్రం జీవో జారీ చేసింది. దీని ప్రకారం స్పెషల్ షోలకు ఏకంగా రూ.1000గా టికెట్ ధరను నిర్ణయించడం విశేషం. అంతేకాదు తొలి పది రోజుల పాటు రోజుకు ఐదు షోలతోపాటు టికెట్ల ధరలను పెంచుకోవడానికీ అనుమతి ఇచ్చారు.
ఈ జీవో ప్రకారం ఈ పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ అయితే ఒక్కో టికెట్ పై రూ.150, మల్టీప్లెక్స్ అయితే రూ.200 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. దీంతో టికెట్ల ధర సింగిల్ స్క్రీన్లలో రూ.297, మల్టీప్లెక్స్ లలో రూ.377కు చేరింది. ఇంత భారీగా ధరల పెంపు నేపథ్యంలో ప్రభాస్ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.
ది రాజా సాబ్ మూవీ విశేషాలు
ది రాజా సాబ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో మొదటిది. ప్రభాస్ చాలా రోజుల తర్వాత తన పాత స్టైల్లో కామెడీ పాత్రను పోషించిన మూవీ. జనవరి 9న రిలీజ్ కాబోతోంది. మారుతి డైరెక్షన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ కామెడీ మూవీగా చెబుతూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ప్రభాస్ భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ తోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటించారు. సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంతకంటే భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సంక్రాంతికి ప్రభాస్ తొలి హిట్ కొడతాడేమో చూడాలి. దీని తర్వాత మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజులాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


