...
...
Next Story

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత.. ఆయన మరణానికి అసలు కారణం ఇదే!

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఇటీవలే దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం (జులై 18) రాత్రి టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (54) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో మరణించడంపై ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.

Published on: Jul 19, 2025, 06:44:25 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో కాలం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ (53) మరణించారు. శుక్రవారం (జులై 18) రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు.

రెండు కిడ్నీలు డ్యామేజ్

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత.. ఆయన మరణానికి అసలు కారణం ఇదే!
టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత.. ఆయన మరణానికి అసలు కారణం ఇదే!

కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఫిష్ వెంకట్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు డ్యామేజ్ కావడంతో డయాలిసిస్ కోసం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో వెంకట్‌ను కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే, రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు ఆయన కుమార్తె తెలిపారు.

50 లక్షల ఖర్చు

రెండు కిడ్నీల మార్పుకు రూ. 50 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్స్ చెప్పినట్లు ఫిష్ వెంకట్ కూతురు ఇటీవల మీడియాకు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్నారు ఫిష్ వెంకట్ కుమార్తె, కుటుంబ సభ్యులు.

విశ్వక్ సేన్ సాయం

అది చూసిన కొంతమంది సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం విరాళం అందించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. అలాగే, మంత్రి వాకిటి శ్రీహరి నటుడు ఫిష్ వెంకట్‌ను పరామర్శించి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. మరికొంత ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

సెలబ్రిటీల సంతాపం

అయితే, కిడ్నీ దాత దొరక్కపోవడంతో ఆరోగ్యం క్షీణించి ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు. కిడ్నీ వ్యాధితో పోరాడి ఫిష్ వెంకట్ కన్నుమూశారు. నటుడి మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఫిష్ వెంకట్ మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

చేపల వ్యాపారంతో

వందకుపైగా సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫిష్ వెంకట్ అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి తదితర సినిమాలతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe