Siddharth: ఒకమ్మాయి చుట్టూ 40 మంది మగాళ్లు.. అందుకే ఐటెమ్ సాంగ్స్ చేయను.. వాళ్లు హీరోలా?: సిద్ధార్థ్ కామెంట్స్

Siddharth Item Songs: సిద్ధార్థ్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉండకపోవడంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తానెప్పుడూ సమాజానికి చెడు సందేశం ఇచ్చే పాత్రలను పోషించబోనని స్పష్టం చేశారు.

Published on: Aug 21, 2026, 13:39:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Siddharth Item Songs: టాలీవుడ్ లవర్ బాయ్, వర్సటైల్ నటుడు సిద్ధార్థ్ గ్లామర్ ప్రపంచంలో నడిచే మైండ్ సెట్‌పై సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar) వెబ్ సిరీస్‌తో క్రేజీ హిట్ కొట్టిన ఈ చాక్లెట్ బాయ్.. తను సినిమాల్లో క్యారెక్టర్లు ఎంచుకునే విధానంపై ఓపెన్‌గా మాట్లాడారు. ఐటెం సాంగ్స్, నెగెటివ్ రోల్స్ చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Siddharth: ఒకమ్మాయి చుట్టూ 40 మంది మగాళ్లు.. అందుకే ఐటెమ్ సాంగ్స్ చేయను.. వాళ్లు హీరోలా?: సిద్ధార్థ్ కామెంట్స్
Siddharth: ఒకమ్మాయి చుట్టూ 40 మంది మగాళ్లు.. అందుకే ఐటెమ్ సాంగ్స్ చేయను.. వాళ్లు హీరోలా?: సిద్ధార్థ్ కామెంట్స్

ఐటెం సాంగ్స్‌కు ఎందుకు దూరం? ఓపెన్‌గా చెప్పిన సిద్ధార్థ్

తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ ఐటెం సాంగ్స్‌లో నటించకపోవడంపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. నలభై మంది పురుషుల మధ్య ఒక మహిళను నిలబెట్టి, ఆమెతో ఎలా పడితే అలా ప్రవర్తించేలా డిజైన్ చేసే స్పెషల్ సాంగ్స్ ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి కాన్సెప్ట్‌లు సమాజంలో మహిళలపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. గ్లామర్ పేరిట మహిళలను ఓ వస్తువులా చూపించే వైఖరి నచ్చకే తాను ఇప్పటివరకు ఒక్క ఐటెం నంబర్‌లో కూడా భాగం కాలేదని డార్లింగ్ యాక్టర్ వివరించారు.

'చెడ్డ పాత్రలు చేసి హీరో అనిపించుకోలేను'

కేవలం రొటీన్ మాస్ హీరో పాత్రలే చేయాలనే రూల్ ఏదీ లేదని, తాను ఎప్పుడూ ఒక యాక్టర్‌గానే ఆలోచిస్తానని సిద్ధార్థ్ తెలిపారు. అయితే సమాజానికి చెడు సందేశం ఇచ్చే స్క్రిప్ట్‌లకు మాత్రం తాను పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పారు.

ఒక చెడ్డ వ్యక్తి క్యారెక్టర్ చేసి, అతడే గొప్ప హీరో అనే రేంజ్‌లో ప్రేక్షకులను భ్రమపెట్టే సినిమాలు తాను చేయనని ఆయన గట్టిగా చెప్పారు. ఒకవేళ అలా చేస్తే అది సిద్ధార్థ్ సినిమా అనిపించుకోదని, తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మంచి వైబ్స్ మాత్రమే వెళ్లాలని అభిప్రాయపడ్డారు.

విలన్ రోల్స్ వర్సెస్ సమాజానికి సందేశం

ఒకవేళ ఫ్యూచర్‌లో పక్కా విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే దానికి తనకేమీ అభ్యంతరం లేదని సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ విలన్ పాత్ర చివర్లో దారుణమైన శిక్ష అనుభవించాలని, చెడు ఎప్పుడూ ఓడిపోవాలనేది తన కండిషన్ అని పేర్కొన్నారు.

విలన్ క్యారెక్టర్‌ను గ్లోరిఫై చేస్తూ, అతడి రౌడీయిజాన్ని స్క్రీన్‌పై హీరోగా ప్రొజెక్ట్ చేస్తే జనాలు థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అలాగే ప్రవర్తించే ప్రమాదం ఉందన్నారు. రీసెంట్‌గా వచ్చిన 'చిన్నా' (Chithha) సినిమాలో చైల్డ్ అబ్యూస్ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేసి మెప్పించిన సిద్ధార్థ్, ఎప్పుడూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు.

'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్రాండ్ సక్సెస్

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ఆపరేషన్ సఫేద్ సాగర్' సిరీస్‌లో సిద్ధార్థ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక వైపు కమర్షియల్ విలువులకు తగ్గకుండా చూసుకుంటూనే, మరోవైపు కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు, సినిమాలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.

'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ లవ్ స్టోరీలతో తెలుగు ఆడియెన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సిద్ధార్థ్, ఇప్పుడు ఈ టైప్ పవర్‌ఫుల్ ఆలోచనలతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More