అది నా హక్కు.. నేను 29 ఏళ్ల వయసులో ఆ పని చేశాను.. పెళ్లి, కెరీర్‌కు సమ ప్రాధాన్యం: తనపై వస్తున్న విమర్శలపై ఉపాసన

పెళ్లి కాదు ముందు కెరీర్‌పై ఫోకస్ చేయండి.. మీ అండాలను దాచి పెట్టండి అన్న తన కామెంట్స్ పై వస్తున్న విమర్శలకు ఉపాసన ఘాటుగానే స్పందించింది. తాను 29 ఏళ్ల వయసులో ఈ పని చేసినట్లు ఆమె తెలిపింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి కవలలకు జన్మనివ్వనున్నట్లు చెప్పింది.

Published on: Nov 19, 2025 9:14 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఎగ్స్ ఫ్రీజింగ్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా ఆమె స్పందించింది. ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు వారి కెరీర్‌పై దృష్టి పెట్టడానికి, సామాజిక ఒత్తిడి లేకుండా పెళ్లి, పిల్లల గురించి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్ ఫ్రీజింగ్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందరి దగ్గరా మీలాగా కోట్లు ఉండవనీ కొందరు అన్నారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది.

అది నా హక్కు.. నేను 29 ఏళ్ల వయసులో ఆ పని చేశాను.. పెళ్లి, కెరీర్‌కు సమ ప్రాధాన్యం: తనపై వస్తున్న విమర్శలపై ఉపాసన
అది నా హక్కు.. నేను 29 ఏళ్ల వయసులో ఆ పని చేశాను.. పెళ్లి, కెరీర్‌కు సమ ప్రాధాన్యం: తనపై వస్తున్న విమర్శలపై ఉపాసన

విమర్శలపై ఉపాసన ఘాటు స్పందన

తన ప్రకటన ఆరోగ్యకరమైన చర్చకు దారితీసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తన కెరీర్, పెళ్లి గురించిన వాస్తవాలను తెలుసుకోవాలని ఉపాసన కోరింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "సామాజిక ఒత్తిడికి లొంగకుండా, ప్రేమ కోసం ఒక స్త్రీ వివాహం చేసుకోవడం తప్పా? సరైన భాగస్వామి దొరికే వరకు ఆమె వేచి ఉండటం తప్పా?

ఆమె తన సొంత పరిస్థితుల ఆధారంగా పిల్లలను ఎప్పుడు కనాలి అని ఎంచుకోవడం తప్పా? వివాహం లేదా త్వరగా పిల్లలను కనడం గురించి మాత్రమే ఆలోచించకుండా, ఒక స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తన కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా?" అని ఆమె ప్రశ్నించింది.

29 ఏళ్ల వయసులో ఎగ్స్ ఫ్రీజ్ చేయించా

తాను 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నట్లు భావించిన వారికి ఉపాసన అసలు నిజం ఏంటో చెప్పింది. తన వివాహం, ఎగ్ ఫ్రీజింగ్, పిల్లల జననం గురించి ఉపాసన ఇలా స్పందించింది. "ఫ్యాక్ట్ చెక్. నేను 27 సంవత్సరాల వయసులో ప్రేమ, సహవాసం కోసం పెళ్లి చేసుకున్నాను. ఇది నా సొంత నిబంధనల ప్రకారం నేను తీసుకున్న నిర్ణయం" అని ఉపాసన చెప్పింది.

"29 ఏళ్ల వయసులో వ్యక్తిగత, ఆరోగ్య కారణాల వల్ల నేను నా అండాలని భద్రపరచాలని (ఎగ్స్ ఫ్రీజ్) నిర్ణయించుకున్నాను. ఇతర మహిళలు కూడా ఈ అవకాశాలను పరిశీలించేలా ప్రోత్సహించడానికి నేను ఎప్పుడూ దీని గురించి బహిరంగంగా మాట్లాడాను" అని ఉపాసన తెలిపింది. అంతేకాదు ఈ ప్రక్రియను తాను తన సొంత హాస్పిటల్ అపోలోలో చేయించుకోలేదని చెప్పింది.

పిల్లల గురించి స్పందిస్తూ.. "నేను 36 సంవత్సరాల వయసులో నా మొదటి బిడ్డ క్లిన్ కారాకు జన్మనిచ్చాను. ఇప్పుడు 39 సంవత్సరాల వయస్సులో కవలల కోసం ఎదురు చూస్తున్నాను" అని తెలిపింది.

"నా ప్రయాణంలో నేను నా కెరీర్‌ను నిర్మించడానికి, నా వైవాహిక జీవితానికి సమాన ప్రాధాన్యత ఇచ్చాను. ఎందుకంటే కుటుంబాన్ని చూసుకునే అప్పుడు సంతోషకరమైన, స్థిరమైన వాతావరణం చాలా ముఖ్యం. నాకు పెళ్లి, కెరీర్ పోటీ పడే ప్రాధాన్యతలు కావు.. అవి సంతృప్తికరమైన జీవితంలో సమానమైన, ముఖ్యమైన భాగాలు. కానీ నేను ఆ సమయాన్ని నిర్ణయించుకుంటాను. అది నాకు ప్రత్యేకంగా లభించిన హక్కు (ప్రివిలెజ్) కాదు.. నా హక్కు" అని ఆమె ముగించింది.

అసలు ఉపాసన ఏం చెప్పింది?

ఐఐటీ హైదరాబాద్‌లోని ఒక సెషన్‌లో ఉపాసన విద్యార్థులతో మాట్లాడుతూ.. "మహిళలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ మీ అండాలను భద్రపరచుకోవడమే. ఎందుకంటే అప్పుడు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలి, ఎప్పుడు మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అనే వాటిని మీ సొంత నిబంధనల ప్రకారం ఎంచుకోవచ్చు.

ఈ రోజు నేను నా సొంత కాళ్ళపై నిలబడ్డాను.. నేను నా కోసం జీవిస్తున్నాను" అని చెప్పింది. దీనిపైనే డాక్టర్లు, సోషల్ మీడియా యూజర్లు ఉపాసన తనకు లభించిన 'ప్రత్యేక హక్కు' (Privilege)తో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.