ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్లు వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ

ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కానుంది. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

Published on: Oct 15, 2025, 15:08:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ శక్తి తిరుమగన్ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా తెలుగులో భద్రకాళి పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్లో నటించాడు. గత నెల 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలోనూ 8.7 రేటింగ్ నమోదైంది.

ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్ల వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ
ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్ల వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ

భద్రకాళి ఓటీటీ రిలీజ్ డేట్

విజయ్ ఆంటోనీ లీడ్ రోల్లో నటించిన సినిమా భద్రకాళి. తమిళంలో శక్తి తిరుమగన్ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (అక్టోబర్ 15) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“ప్రతి మైండ్ కు ఓ మాస్టర్ ఉంటారు. మాస్టర్‌మైండ్ శక్తి తిరుమగన్ ను అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్ లో కలవండి.. శక్తి తిరుమగన్ అక్టోబర్ 24 నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి తెలుగు, తమిళం పోస్టర్లను జత చేసింది.

భద్రకాళి మూవీ గురించి..

భద్రకాళి మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. అరుణ్ ప్రభు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. విజయ్ ఆంటోనీయే నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమాలో కిట్టూ అనే ఓ పవర్ బ్రోకర్ గా విజయ్ నటించాడు. ఓ కేంద్ర మంత్రికి సంబంధించిన రూ.800 కోట్ల భూమి వ్యవహారంలోకి అతడు వెళ్తాడు. అయితే ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవుతాడు.

అంతేకాదు మొత్తంగా ఓ బ్రోకర్ గా కిట్టూ ఏకంగా రూ.6 వేల కోట్లకుపైగా వెనకేసుకున్నట్లు తేలుతుంది. అసలు అతడు ఎవరు? అంతలా ఎలా సంపాదించాడు? తర్వాత ఏం జరిగిందన్నది ఈ భద్రకాళి మూవీ స్టోరీ. ఈ మూవీ ప్రేక్షకులకు కాస్త థ్రిల్ పంచింది. థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత అంటే అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More