Vijay Rashmika: విజయ్, రష్మికను చూడటానికి ఎగబడిన జనం.. నాగర్కర్నూల్లో అభిమాన సంద్రం.. వీడియో వైరల్
ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వైభవంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమ వైవాహిక జీవితంలో మరో ముఖ్య ఘట్టాన్ని పూర్తి చేశారు. సోమవారం (మార్చి 2) తెలంగాణలోని తుమ్మనపేటలో గల తమ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు.
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట.. సోమవారం (మార్చి 2) తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని తుమ్మనపేటలో వారు నిర్మించుకున్న కొత్త ఇంట్లో అత్యంత వైభవంగా 'గృహప్రవేశం', 'సత్యనారాయణ వ్రతం' నిర్వహించారు.

అభిమానుల కోలాహలం
తమ అభిమాన జంట కొత్త ఇంట్లోకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వందలాది మంది అభిమానులు తుమ్మనపేటకు చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం విజయ్, రష్మికలు బయటకు వచ్చి అభిమానులను పలకరించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ తన అర్ధాంగి రష్మిక చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకురాగా, ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మైక్ తీసుకున్న రష్మిక.. "ఐ లవ్ యు" అంటూ అభిమానులపై తన ప్రేమను చాటుకోగా, విజయ్ సైతం అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
టీటీడీ ఆలయ సందర్శన
అంతకుముందు ఈ కొత్త దంపతులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో తమను కలిసిన భక్తులకు స్వయంగా స్వీట్లు పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. "మా మనసు నిండా సంతోషం నిండిపోయింది" అంటూ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఆలయ పర్యటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
అంతేకాదు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జరిగిన స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా రష్మిక అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేశంలో ఓ సెలబ్రిటీ జోడీ పెళ్లి తర్వాత ఇలా దేశవ్యాప్తంగా స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయడం అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది.
హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్
విజయ్-రష్మిక వివాహ విందు (రిసెప్షన్) మార్చి 4న హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతిథుల జాబితాను పరిమితం చేసినట్లు సమాచారం. అభిమానులు వేడుక జరిగే ప్రాంతానికి రావొద్దని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని పోలీసులు, నిర్వహకులు కోరారు. ప్రధాని మోదీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.

E-Paper












