PPF vs SIP : పీపీఎఫ్​ వర్సెస్ మ్యూచువల్​ ఫండ్ సిప్- 15ఏళ్లలో దేనితో అధిక రిటర్నులు?

నెలకు 10 వేల రూపాయలు పొదుపు చేయాలనుకుంటున్నారా? పీపీఎఫ్ సురక్షితమా లేక ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్ సిప్ ఎక్కువ లాభాన్ని ఇస్తుందా? 15 ఏళ్ల కాలపరిమితిలో పన్నుల తర్వాతి రాబడుల సమగ్ర పోలిక ఇక్కడ చూడండి..

Published on: Aug 30, 2026, 06:08:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దీర్ఘకాలిక లక్ష్యాల కోసం డబ్బు దాచుకోవాలనుకునే ప్రతి ఒక్కరి మనసులో మొదట మెదిలే ప్రశ్నలు.. "మన డబ్బు సురక్షితంగా ఉంటుందా?", "ఎంత రాబడి వస్తుంది?". ఇదే విషయాన్ని ఇద్దరు స్నేహితులు రీమా, సీమా ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఇద్దరు కూడా.. వచ్చే 15 ఏళ్లలో పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నెలకు రూ. 10,000 చొప్పున కేటాయించడానికి సిద్ధపడ్డారు.

పీపీఎఫ్​ వర్సెస్ మ్యూచువల్​ ఫండ్ సిప్
పీపీఎఫ్​ వర్సెస్ మ్యూచువల్​ ఫండ్ సిప్

అయితే రీమా పూర్తిగా ప్రభుత్వ భద్రత ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)ను ఎంచుకోగా, సీమా కాస్త ముందుకు వెళ్లి నిర్భయంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) మార్గాన్ని ఎంచుకుంది. 15 ఏళ్లు ముగిసేసరికి ఎవరి చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది? నిపుణుల లెక్కలు ఏం చెబుతున్నాయో విశ్లేషిద్దాము.

పీపీఎఫ్ భద్రత.. పన్ను లేని ఆదాయం

రీమా ఎంచుకున్న పీపీఎఫ్ ఖాతాలో నెలకు రూ. 10,000 చొప్పున 15 ఏళ్లలో మొత్తం రూ. 18 లక్షలు పెట్టుబడి పెడుతుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు 15 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగితే, గడువు ముగిసే సమయానికి రీమా చేతికి సుమారు రూ. 32.5 లక్షల నిధి అందుతుంది.

పీపీఎఫ్ అనేది 'ఈఈఈ' (ఎగ్జెంప్ట్- ఎగ్జెంప్ట్- ఎగ్జెంప్ట్-) కేటగిరీ కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి మొత్తం, వచ్చిన వడ్డీ, గడువు ముగిసాక వచ్చే మెచ్యూరిటీ సొమ్ముపై పైసా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దానితో ఆ రూ. 32.5 లక్షలు పూర్తిగా రీమా సొంతమవుతాయి.

ఈక్విటీ ఎస్‌ఐపీ: మార్కెట్ రాబడుల తీరు ఇది

మరోవైపు సీమా కూడా 15 ఏళ్లలో మొత్తం రూ. 18 లక్షలనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతుంది. కానీ పీపీఎఫ్ లాగా మ్యూచువల్​ ఫండ్ సిప్​లో స్థిరమైన రాబడి ఉండదు. ఇక్కడ రాబడి పూర్తిగా మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన లాభాలపై 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) చెల్లించాల్సి ఉంటుంది.

ఇన్వెస్ట్​మెంట్15ఏళ్ల తర్వాత కార్పస్ట్యాక్స్ కట్ అయిన తర్వాత కార్పస్
రీమా – 7.1% పీపీఎఫ్రూ. 32.2 లక్షలురూ. 32.2 లక్షలు
సీమా – 8% సిప్రూ. 34.8 లక్షలురూ. 32.7 లక్షలు
సీమా – 10% సిప్రూ. 41.8 లక్షలురూ. 38.9 లక్షలు
సీమా – 12% సిప్రూ. 50.4 లక్షలురూ. 46.4 లక్షలు

సీమాకు లభించే వేర్వేరు రాబడుల ఆధారంగా మూడు విశ్లేషణలను పరిశీలిద్దాం:

8 శాతం రాబడి వస్తే: 15 ఏళ్లలో సీమా కార్పస్ పన్నుకు ముందు రూ. 34.8 లక్షలకు చేరుతుంది. 12.5 శాతం ఎల్టీసీజీ పన్ను మినహాయించిన తర్వాత ఆమె చేతికి రూ. 32.7 లక్షలు మాత్రమే వస్తాయి. అంటే పీపీఎఫ్ (రూ. 32.5 లక్షలు) కంటే ఇది చాలా స్వల్పమైన ఆధిక్యత మాత్రమే.

10 శాతం రాబడి వస్తే: పన్నుకు ముందు కార్పస్ రూ. 41.8 లక్షలు కాగా, పన్ను చెల్లించిన తర్వాత సీమాకు దాదాపు రూ. 38.9 లక్షలు దక్కుతాయి. ఇది పీపీఎఫ్ కంటే చాలా మెరుగైన మొత్తం.

12 శాతం రాబడి వస్తే: మార్కెట్లు బాగా కలిసివచ్చి 12 శాతం చొప్పున వార్షిక రాబడి వస్తే, సీమా చేతికి పన్నుకు ముందు రూ. 50.4 లక్షలు చేరుతాయి. వర్తించే పన్ను మినహాయించుకున్నా కూడా ఆమెకు రూ. 46.4 లక్షల భారీ నిధి లభిస్తుంది.

ఏది ఎవరికి అనుకూలం?

ఈ పోలిక ద్వారా ఒక స్పష్టమైన విషయం అర్థమవుతోంది. మ్యూచువల్ ఫండ్ రాబడి 8 శాతానికే పరిమితమైతే, పన్నుల తర్వాత లభించే అదనపు ప్రయోజనం పెద్దగా ఉండదు. కానీ రాబడి 10 శాతం లేదా 12 శాతానికి చేరినప్పుడు పీపీఎఫ్ కంటే మ్యూచువల్​ ఫండ్ సిప్ గణనీయమైన లాభాన్ని అందిస్తుంది.

సురక్షితమైన రాబడి, కచ్చితత్వంతో కూడిన పన్ను రహిత ధనాన్ని కోరుకునే వారికి పీపీఎఫ్ సరైన మార్గం. కానీ మార్కెట్ రిస్క్ భరిస్తూ, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పెద్దమొత్తంలో సంపద సృష్టించాలనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్ సిప్ అత్యుత్తమ ఎంపిక.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More