8వ పే కమిషన్ అప్డేట్స్ కోసం చూస్తున్నారా? శాలరీ కాలిక్యులేటర్ స్కామ్ అలెర్ట్
8వ పే కమిషన్ అమలు, జీతాల పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఉన్న ఆసక్తిని సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. "శాలరీ కాలిక్యులేటర్" పేరుతో వాట్సాప్లో వస్తున్న ఫేక్ మెసేజ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం (I4C) హెచ్చరికలు జారీ చేసింది. ఒక్క క్లిక్తో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
8వ పే కమిషన్ ఎప్పుడు వస్తుంది? జీతం ఎంత పెరుగుతుంది? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. సరిగ్గా ఇదే పాయింట్ను స్కామర్లు వాడుకుంటున్నారు. వాట్సాప్లో 'మీ కొత్త జీతం ఎంతో ఈ యాప్లో లెక్కించుకోండి' అంటూ కొన్ని లింకులు పంపిస్తున్నారు. ఇవి అసలైన కాలిక్యులేటర్లు కావు, మీ ఫోన్ను హ్యాక్ చేసే సైబర్ నేరగాళ్ల ఉచ్చులు.

ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) ఈ మోసం జరిగే తీరును ఇలా వివరించింది.
- మెసేజ్ రావడం: ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో 8వ పే కమిషన్ తర్వాత మీ శాలరీ లేదా పెన్షన్ వివరాలు తెలుసుకోవచ్చని ఉంటుంది.
- APK ఫైల్: ఆ వివరాల కోసం ఒక APK ఫైల్ (ఒక రకమైన యాప్ ఇన్స్టలేషన్ ఫైల్) డౌన్లోడ్ చేయమని కోరుతారు.
- యాక్సెస్ పొందడం: మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయగానే, మీ ఫోన్ కంట్రోల్ మొత్తం స్కామర్ల చేతికి వెళ్తుంది.
- డబ్బు మాయం: మీ ఫోన్ ద్వారా మీ బ్యాంకింగ్ వివరాలు, OTPలు దొంగిలించి క్షణాల్లో మీ ఖాతా నుండి డబ్బు విత్ డ్రా చేస్తారు.
మోసపోకుండా ఉండాలంటే.. ఏం చేయాలి? (Dos)
- అధికారిక వెబ్సైట్: 8వ పే కమిషన్ లేదా జీతాల గురించి ఏదైనా సమాచారం కావాలంటే కేవలం అధికారిక వెబ్సైట్: https://8cpc.gov.in/ ను మాత్రమే సందర్శించండి.
- వెరిఫైడ్ సోర్స్: ప్రభుత్వం ఎప్పుడూ వాట్సాప్ ద్వారా APK ఫైళ్లను పంపదని గుర్తుంచుకోండి. వార్తలను కేవలం నమ్మదగ్గ టీవీ ఛానళ్లు లేదా వెబ్సైట్ల నుండే తెలుసుకోండి.
- లింకులను తనిఖీ చేయండి: ఏదైనా లింక్ వచ్చినప్పుడు అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? డొమైన్ పేరు వింతగా ఉందా? అని గమనించండి.
- బ్యాంకును సంప్రదించండి: ఒకవేళ అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే మీ బ్యాంక్ ప్రతినిధికి ఫోన్ చేసి నిర్ధారించుకోండి.
ఏం చేయకూడదు? (Don'ts)
- APK ఫైల్స్ డౌన్లోడ్ వద్దు: అపరిచిత వ్యక్తులు పంపే యాప్స్ లేదా ఫైళ్లను పొరపాటున కూడా ఇన్స్టాల్ చేయకండి.
- రహస్య వివరాలు పంచుకోవద్దు: మీ OTP, UPI పిన్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, CVV, లేదా వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ ఎవరికీ చెప్పకండి. ప్రభుత్వం ఇవి ఎప్పటికీ అడగదు.
- అత్యవసరం అని భయపడకండి: స్కామర్లు ఎప్పుడూ "వెంటనే చేయండి, లేదంటే మీ సర్వీస్ ఆగిపోతుంది" అంటూ భయపెడతారు. అలాంటి మెసేజ్లను పట్టించుకోకండి.
1930కు కాల్ చేయండి
సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


