ఎయిమ్స్లోనే 52 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ.. ప్రజారోగ్యానికి భరోసా ఏది?
దేశంలోని పలు ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఎయిమ్స్ (AIIMS)లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్ని సంస్థల్లో సగానికి పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.
దేశంలోనే అత్యున్నత వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఢిల్లీ ఎయిమ్స్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 34 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

ఢిల్లీ ఎయిమ్స్లో ఖాళీల వివరాలివే..
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఢిల్లీ ఎయిమ్స్లో మొత్తం 1,306 ఫ్యాకల్టీ పోస్టులు మంజూరవ్వగా, ప్రస్తుతం అందులో 446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సుమారు 34.15 శాతం మేర కీలకమైన డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
కేవలం ఫ్యాకల్టీ మాత్రమే కాదు, ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నర్సింగ్ ఆఫీసర్లు, టెక్నికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది వంటి నాన్-ఫ్యాకల్టీ విభాగంలో మొత్తం 13,911 పోస్టులు ఉండగా.. అందులో 2,542 (18 శాతం) ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశం నలుమూలల నుంచి రోగులు భారీగా తరలివచ్చే ఈ ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణం కేవలం ఢిల్లీ ఎయిమ్స్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సంస్థల్లోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎయిమ్స్ పరిస్థితి పరిశీలిస్తే:
ఎయిమ్స్ మంగళగిరి (ఆంధ్రప్రదేశ్):
ఇక్కడ ఏకంగా 52 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.
ఎయిమ్స్ బీబీనగర్ (తెలంగాణ):
ఇక్కడ సుమారు 45 శాతం ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
అదేవిధంగా ఎయిమ్స్ దేవ్ఘర్లో 50 శాతం, ఎయిమ్స్ రాజ్కోట్లో 48 శాతం మేర ఫ్యాకల్టీ కొరత ఉందని కేంద్రం వెల్లడించింది. అత్యాధునిక వైద్యం సామాన్యుడికి చేరువ కావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థల్లో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


