Vivo T5 5G : 7050ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్ఫోన్- టీ5 ధర ఎంతంటే..
భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన నూతన 'వివో టీ5 5జీ' స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. భారీ 7,050ఎంఏహెచ్ బ్యాటరీ, 144హెచ్జెడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్తో వచ్చిన ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు, ఫ్లిప్కార్ట్ సేల్ వివరాలు తెలుసుకోండి..
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో.. భారత మార్కెట్లోకి తమ ప్రముఖ టీ-సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ‘వివో టీ5 5జీ’ పేరుతో ఈ ఫోన్ను బుధవారం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్లో ఐదో మోడల్గా వచ్చిన ఈ హ్యాండ్సెట్ ప్రధానంగా సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, వేగవంతమైన గేమింగ్ అనుభూతిని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకుంది.

కేవలం 7.99 మిల్లీమీటర్ల సన్నని బాడీలోనే ఏకంగా 7,050ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చడం ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత. సాధారణంగా రోజువారీ ప్రయాణాల్లో పదే పదే ఛార్జింగ్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది.
వివో టీ5 5జీ- వేరియంట్లు, ధరలు, బ్యాంక్ ఆఫర్లు..
వివో టీ5 5జీ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది:
- 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ప్రారంభ ధర: రూ. 34,999
- 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర: రూ. 39,999
- 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర: రూ. 44,999
- 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ ధర: రూ. 49,999
ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా సెప్టెంబర్ 9 నుంచి దీని విక్రయాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 4,000 వరకు తక్షణ ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ప్రారంభ వేరియంట్ను కేవలం రూ. 30,999కే సొంతం చేసుకోవచ్చు.
వివో టీ5 5జీ- డిస్ప్లే, ఐపీ69 రేటింగ్
విజువల్స్ పరంగా ఈ వివో టీ5 5జీ స్మార్ట్ఫోన్ అత్యుత్తమ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 6.83 ఇంచుల 1.5K (1260 x 2800 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. 144హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఓటీటీల్లో సినిమాలు చూసేవారికి, గేమర్లకు ఇది చక్కటి డిస్ప్లే అనుభవాన్ని ఇస్తుంది.
అంతేకాకుండా, ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. వర్షాకాలంలో నీటి తుంపర్లు పడినా లేదా పొరపాటున నీటిలో మునిగినా ఫోన్ దెబ్బతినకుండా ఉండేలా దీనిని డిజైన్ చేశారు.
వివో టీ5 5జీ - ప్రాసెసర్, కెమెరా..
ఈ స్మార్ట్ఫోన్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ఆక్టాకోర్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో మెరుగైన ఏఐ ప్రాసెసింగ్ కోసం మీడియాటెక్ ఎన్పీయూ 850ని కూడా అందించారు. యాంటటు బెంచ్మార్క్ పరీక్షల్లో ఇది 12 లక్షలకు పైగా స్కోర్ సాధించడం దీని సామర్థ్యానికి నిదర్శనం. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా అధునాతన కూలింగ్ వ్యవస్థను పొందుపరిచారు.
ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎంక్స్882 ప్రైమరీ కెమెరా (ఓఐఎస్ సపోర్ట్తో), 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలను అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) వల్ల రాత్రి వేళల్లో కూడా కదలికలు లేని స్పష్టమైన ఫోటోలు, 4కే వీడియోలు తీయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘ఆరిజిన్ ఓఎస్ 6’తో ఈ వివో టీ5 5జీ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. వినియోగదారులకు 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని వివో స్పష్టం చేసింది. దీనిలోని 7,050ఎంఏహెచ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. సింగిల్ ఛార్జ్పై ఏకంగా 22 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చని కంపెనీ తెలుపుతోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కేనర్, 5జీ, వైఫై 6, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


