...
...
Next Story

UPSC CSE Result 2026 : యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల - ఏపీ, తెలంగాణ నుంచి ఎంపికైన వారు వీరే…

UPSC Civils Results 2025 : యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు యూపీఎస్‌సీ సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి పలువురు అభ్యర్థులు మెరిశారు.

Published on: Mar 6, 2026, 15:01:04 IST
Advertisement

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2025 (యూపీఎస్సీ ) తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు యూపీఎస్‌సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది అనుజ్ అగ్నిహోత్రి ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించింది. రాజేశ్వరి సువే రెండో స్థానంలో, ఆకాంష్ ధుల్ మూడో స్థానంలో నిలిచారు.

యూపీఎస్సీ ఫలితాలు
యూపీఎస్సీ ఫలితాలు

మే 25, 2025న ప్రిలిమ్స్ నిర్వహించగా… ఆగస్టు 2025లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు జరిగిన ఇంటర్వ్యూల ఆధారంగా ఇవాళ తుది మెరిట్ లిస్ట్‌ను యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఫలితాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్లు https://upsc.gov.in/index.php లేదా upsconline.nic.inలో చూడొచ్చు.

UPSC CSE 2025 రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:

  1. అభ్యర్థులు https://upsconline.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఫైనల్ రిజల్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థుల పేర్లు, రూల్ నెంబర్ తో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంటుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసె, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసులకు ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే..?

సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు మెరిశారు. సృజన 55వ ర్యాంక్‌ సాధించగా… డీఎస్‌కే ప్రచేత్‌ 193వ ర్యాంక్‌ దక్కించుకున్నారు. ఎస్. వర్షిత్‌రెడ్డి (259వ ర్యాంక్‌), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297వ ర్యాంక్), వి. విక్రమసింహారెడ్డి (541వ ర్యాంక్‌), గుమ్మల శ్వేత 573 ర్యాంక్ దక్కించుకున్నారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు - 2025ను చూడొచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe