ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ పెట్టుబడి: బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ షేర్ల జోరు, 18% జంప్
ఏఐ (AI) ఆధారిత డేటా సెంటర్ల రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ షేర్లు సోమవారం ట్రేడింగ్లో 18% దూసుకెళ్లాయి. 800 మెగావాట్ల సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టును కంపెనీ చేపట్టనుంది.
భారత ఐటీ రంగంలోని స్మాల్-క్యాప్ కంపెనీ బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ సొల్యూషన్స్ (BCSSL) ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల వ్యాపారం కోసం ఏకంగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,400 కోట్లు) భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించడంతో సోమవారం ఈ షేరు ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్లింది.

సోమవారం ఉదయం ట్రేడింగ్లో ఈ స్టాక్ 17.67 శాతం లాభపడి రూ. 21.30 స్థాయిని తాకింది. గత వారం ముగింపు ధర రూ. 18.10తో పోలిస్తే, నేడు ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించింది.
ఏమిటీ భారీ ప్రాజెక్టు?
బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కంపెనీ దశలవారీగా 800 మెగావాట్ల (MW) సామర్థ్యం గల డేటా సెంటర్లను నిర్మించనుంది. దీనివల్ల దేశంలోని అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీ అగ్రస్థానంలో నిలవనుంది. ప్రధానంగా ఈ పెట్టుబడి కింది అంశాలపై దృష్టి సారిస్తుంది.
- ఏఐ-నేటివ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్: మెషిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్లౌడ్ సేవలు.
- వ్యూహాత్మక రంగాలు: రక్షణ (Defense), అంతరిక్షం (Space), సెమీకండక్టర్లు మరియు ప్రభుత్వ డేటా భద్రత కోసం ప్రత్యేక 'సావరిన్ క్లౌడ్' వాతావరణాన్ని నిర్మించడం.
- హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC): అత్యంత వేగవంతమైన డేటా విశ్లేషణ కోసం అధునాతన జీపీయూ (GPU) క్లస్టర్ల ఏర్పాటు.
వ్యాపార విస్తరణపై ఛైర్మన్ ధీమా
"ఈ పెట్టుబడి ప్రణాళిక భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై మాకు ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది. దశలవారీగా ఏఐ-నేటివ్ డిజైన్లతో మేము నిర్మించబోయే డేటా సెంటర్లు అటు పరిశ్రమలకు, ఇటు జాతీయ ప్రయోజనాలకు తోడ్పడతాయి" అని బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ ఛైర్మన్ జానకి యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశ 2026 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం కానుంది.
మల్టీబ్యాగర్ ప్రయాణం
బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ షేరు గత కొంతకాలంగా ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను పంచింది. గత ఐదేళ్ల కాలంలో ఈ షేరు ఏకంగా 328 శాతం పెరిగి మల్టీబ్యాగర్గా నిలిచింది. గతేడాది ఈ స్టాక్ తన గరిష్ట స్థాయి రూ. 41.83ను తాకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం రుకు మళ్లీ కొత్త ఊపిరి పోసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


