దిగొచ్చిన కేంద్రం: CJP నిరసన విరమణ, కేసుల ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన సుదీర్ఘ నిరసనను విరమించింది. విద్యార్థులపై మోపిన కేసుల ఎత్తివేత, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు గరిష్ట పరిహారం, పరీక్షల సంస్కరణల చార్టర్‌ను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించింది.

Published on: Jul 25, 2026, 19:24:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గత కొన్నివారాలుగా దేశ రాజధానిలో సాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే, కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) తన దేశవ్యాప్త ఉద్యమాన్ని తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్లన్నింటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దిగొచ్చిన కేంద్రం: CJP నిరసన విరమణ, కేసుల ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్ (PTI)
దిగొచ్చిన కేంద్రం: CJP నిరసన విరమణ, కేసుల ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్ (PTI)

శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలసి CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్రం, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

"నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ప్రతులను CJP ప్రతినిధులకు అందజేస్తాం. విద్యార్థులపై ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవు, అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

ఒప్పందంలోని 3 ప్రధాన అంశాలు

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు కీలక డిమాండ్ల వివరాలు:

కేసుల రద్దు: కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తాయి. భవిష్యత్తులోనూ ఎలాంటి విచారణలు ఉండవు.

కుటుంబాలకు పరిహారం: నీట్ పేపర్ లీకేజీ, రీ-టెస్ట్ ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఇవ్వగలిగే గరిష్ట పరిహారాన్ని అందజేస్తారు.

పరీక్షల సంస్కరణలు: పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం CJP సమర్పించిన 5 అంశాల చార్టర్‌పై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి, వారి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుంది.

"విద్యార్థుల అన్ని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది. సద్భావనతో మా దేశవ్యాప్త ఆందోళనను తక్షణమే విరమిస్తున్నాం" అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.

నీట్ వివాదం, దానికి తోడు విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. కేంద్రం దిగిరావడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్యతకు దక్కిన విజయంగా నిలిచింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More