స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ క్యుపిడ్ దూకుడు: జూన్‌లో 47% పెరిగిన షేరు

స్మాల్-క్యాప్ స్టాక్ క్యూపిడ్ లిమిటెడ్ దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. జూన్ నెలలోనే ఈ షేరు 47 శాతం లాభపడగా, గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 800 శాతం పెరిగి మల్టీబ్యాగర్‌గా నిలిచింది.

Published on: Jun 30, 2026, 19:11:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దలాల్ స్ట్రీట్‌లో స్మాల్ క్యాప్ స్టాక్ 'క్యూపిడ్ లిమిటెడ్' (Cupid Ltd) ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో భారీ లాభాలను అందిస్తూ దూసుకుపోతోంది. పెద్దగా పెద్ద పెద్ద వార్తల్లో నిలవకపోయినా, బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు లేకపోయినా 2026 ప్రథమార్ధంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన స్టాక్స్‌లో ఒకటిగా నిలిచి మార్కెట్ వర్గాలను ఆకర్షించింది.

స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ క్యూపిడ్ దూకుడు: జూన్‌లో 47% పెరిగిన షేరు
స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ క్యూపిడ్ దూకుడు: జూన్‌లో 47% పెరిగిన షేరు

వరుసగా నాలుగో నెల కూడా లాభాలు

జూన్ నెలలో క్యూపిడ్ షేరు మరో 47 శాతం మేర పెరిగింది. డిసెంబర్ 2025 తర్వాత ఈ స్థాయిలో ఒకే నెలలో పెరగడం ఇదే మొదటిసారి. ఈ తాజా పురోగతితో 2026 మొదటి ఆరు నెలల్లోనే ఈ స్టాక్ 83 శాతం లాభాలను ఇచ్చింది. అంతకుముందు 2025లో ఈ షేరు ఏకంగా 584 శాతం పెరగడం గమనార్హం.

కండొమ్స్ తయారీ రంగంలో దేశంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న క్యూపిడ్, మార్కెట్ అస్థిరతల మధ్య కూడా ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచింది. ఏడాది క్రితం కొంత ఒత్తిడిని ఎదుర్కొన్న ఈ షేరు, ఏప్రిల్ నుంచి మళ్లీ పుంజుకుని 25 శాతం పెరిగింది. అక్కడ నుంచి గత 14 నెలల్లో 12 సార్లు లాభాల్లోనే ముగిసి, మొత్తంగా 1,416 శాతం భారీ ర్యాలీ చేసింది. ఈ కాలంలో షేరు ధర రూ. 12.53 నుంచి మునుపటి క్లోజింగ్ ధర రూ. 190కి చేరింది.

రిటైల్ ఇన్వెస్టర్లదే మెజారిటీ వాటా

ఈ అద్భుతమైన వృద్ధి వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారు. మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఈ కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్లకు 52.8 శాతం వాటా ఉంది. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, రూ. 2 లక్షల లోపు పెట్టుబడి పెట్టిన దాదాపు 2 లక్షలకు మందికి పైగా చిన్న ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో 13.81 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ దూకుడుతో కంపెనీ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) సుమారు రూ. 25,000 కోట్లకు చేరుకుంది.

ఆదాయ అంచనాలను పెంచిన యాజమాన్యం

ఆర్థిక సంవత్సరం 2027 (FY27) మొదటి అర్ధభాగంలో కంపెనీ ఆదాయం రూ. 150 కోట్లు దాటుతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, FY27 పూర్తి స్థాయి ఆదాయ అంచనాను కనీసం 10 శాతం పెంచి రూ. 660 కోట్లుగా నిర్దేశించుకుంది.

"FY27లో మా బలమైన ఆరంభం, గత కొన్నేళ్లుగా క్యూపిడ్ సాధించిన మార్పునకు నిదర్శనం. విభిన్న వ్యాపార విభాగాలతో బహుళ వృద్ధి ఇంజన్లను నిర్మించాం, ఇవన్నీ ఇప్పుడు ఒకేసారి వృద్ధి బాటలో పయనిస్తున్నాయి" అని క్యూపిడ్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియా తెలిపారు.

అంతర్జాతీయ బిజినెస్-టు-బిజినెస్ (B2B) విభాగంలో మంచి పురోగతి కనిపిస్తోందని ఆయన చెప్పారు. ప్రైవేట్ మార్కెట్లు, ప్రభుత్వ టెండర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు మెరుగయ్యాయని, పీఎఫ్ఎస్‌సీఎమ్ (PFSCM) తో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కొనుగోళ్లలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని హల్వాసియా వివరించారు.

(గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం).

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More