ఏడాదిలో 49శాతం వరకు రిటర్నులు! ఈ Muhurat trading లో ఈ స్టాక్స్ కొంటే బెస్ట్!
దీపావళి స్టాక్స్ టు బై లిస్ట్ని చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా 49శాతం వరకు రిటర్నులు ఇచ్చే స్టాక్స్ లిస్ట్ ఇది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ముహురత్ ట్రేడింగ్ సెషన్ కోసం ఇన్వెస్టర్లు సిద్ధమవుతున్నారు! హిందూ క్యాలెండర్ ప్రకారం.. కొత్త సంవత్సరం సంవత్ 2082 ప్రారంభాన్ని సూచించే ఈ పండుగ సీజన్కు సంబంధించి, దేశీయ బ్రోకరేజ్ సంస్థ 'చాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్'.. పరిగణించదగిన 15 స్టాక్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, జెన్సార్ టెక్నాలజీస్, భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ స్టాక్లు ఉన్నాయి.

మల్టీబ్యాగర్ రాబడినిచ్చే స్టాక్స్పై బ్రోకరేజ్ అంచనా..
చాయిస్ బ్రోకరేజ్ సంస్థ వివిధ రంగాలకు చెందిన స్టాక్లను ఎంచుకుంది. ముఖ్యంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ స్టాక్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. టెక్, డిఫెన్స్, ఆటో, ఆటో అనుబంధ రంగాల స్టాక్లకు సమాన వెయిటేజీ ఇచ్చింది.
మొత్తంగా, ఈ స్టాక్లు వచ్చే ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 49% వరకు రాబడిని అందించవచ్చని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఎంచుకున్న స్టాక్లలో కొన్ని దాదాపు 50% వరకు పెరిగే అవకాశం ఉందని చాయిస్ భావిస్తోంది!
రంగాల వారీగా అంచనాలు, షేర్ ప్రైజ్ టార్గెట్ వివరాలు..
1. టెక్నాలజీ రంగం..
జెన్సార్ టెక్నాలజీస్ (Zensar Technologies): అత్యధిక రాబడినిచ్చే స్టాక్లలో ఇది అగ్రస్థానంలో ఉంది! ఈ స్టాక్ రూ. 1,130 స్థాయికి చేరుకోగలదని, ఇది ఇటీవల ట్రేడ్ అయిన ధర కంటే 49.4% అధికమని బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. దీనికి 'బై రేటింగ్ ఇచ్చింది. వెండర్ కన్సాలిడేషన్ కాకుండా, ఏఐ-ఆధారిత ఇన్నోవేటివ్ డీల్స్పై కంపెనీ దృష్టి పెట్టడం దీనిని ఇతర పోటీదారుల నుంచి వేరు చేస్తోందని బ్రోకరేజ్ హైలైట్ చేసింది.
కోఫోర్జ్ Coforge: ఈ స్టాక్ కూడా జాబితాలో ఉంది. దీని విలువ 9.3% పెరిగి రూ. 1,930కు చేరుకోవచ్చని అంచనా వేస్తూ, 'కొనుగోలు' రేటింగ్ను కొనసాగించింది.
2. సిమెంట్ రంగం..
బిర్లా కార్పొరేషన్ (Birla Corporation): చాయిస్ బ్రోకరేజ్ అగ్రస్థానం ఇచ్చిన మరో స్టాక్ ఇది. దీనికి 'బై' రేటింగ్ను కొనసాగిస్తూ, వచ్చే ఏడాదిలో స్టాక్ 38.9% పెరిగి రూ. 1,650కు చేరుకోగలదని అంచనా వేసింది.
నువోకో విస్టాస్ కార్పొరేషన్ (Nuvoco Vistas Corporation): మరో సిమెంట్ తయారీ సంస్థ నువోకో విస్టాస్ను కూడా ఎంచుకుంది. బుధవారం ముగింపు ధర రూ. 405 నుంచి ఈ స్టాక్ 38.2% పెరిగి రూ. 560కు చేరుకోవచ్చని అంచనా వేసింది. రేటింగ్: 'బై'.
మ్యాన్ ఇండస్ట్రీస్ (Man Industries): పెద్ద పైపుల తయారీలో ప్రముఖ సంస్థ అయిన మ్యాన్ ఇండస్ట్రీస్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ స్టాక్ 18.8% పెరిగి రూ. 480కు చేరుకోగలదని సంస్థ అంచనా వేసింది.
3. ఫార్మా రంగం..
సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ (Senores Pharmaceuticals): బలమైన రాబడి వేగం, ఆదాయాల పెరుగుదల, మార్జిన్ విస్తరణ కారణంగా దీనిని ఎంపిక చేశారు. ఈ స్టాక్ వచ్చే ఏడాదిలో 33.4% పెరిగి రూ. 719 నుంచి రూ. 960కు చేరుకోగలదని భావిస్తున్నారు.
జీనా సిఖో లైఫ్కేర్ (Jeena Sikho Lifecare): ఈ స్టాక్ కూడా 21.2% పెరిగి రూ. 900కు చేరుకోగలదని సంస్థ అంచనా వేసింది.
4. ఎనర్జీ రంగం..
గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ (Gulf Oil Lubricants): ఈ రంగంలో గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ బలమైన వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ నమ్ముతోంది. మెరుగైన వాల్యూమ్ అవుట్పెర్ఫార్మెన్స్, బ్రాండింగ్లో స్థిరమైన పెట్టుబడి, మార్జిన్లను పెంచుకుంటూ వాల్యూమ్ వృద్ధిపై దృష్టి పెట్టడం దీనికి మద్దతు ఇస్తుంది. బ్రోకరేజ్ దీనికి రూ. 1,600 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఇది 31.3% పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ, 'బై' రేటింగ్ను కొనసాగించింది.
5. రక్షణ రంగం..
భారత్ డైనమిక్స్ (BDL): టార్గెట్ ధర రూ. 1,965, ఇది 30.9% రాబడిని సూచిస్తుంది.
భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL): టార్గెట్ ధర రూ. 500, ఇది 22.5% పెరిగే అవకాశం ఉందని సూచిస్తుంది.
6. ఆటో అండ్ అనుబంధ రంగాలు..
మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra): ఆటో రంగం నుంచి దీనిని ఎంపిక చేశారు. టార్గెట్ ధర రూ. 4,150. ఇది 18.7% పెరుగుదలను సూచిస్తుంది.
లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ (Lumax Auto Technologies): ఆటో అనుబంధ రంగం నుంచి దీని టార్గెట్ ధర రూ. 1,300. ఇది 14% పెరుగుదలను సూచిస్తుంది.
7. లిక్కర్ స్టాక్స్..
అలైడ్ బ్లెండర్స్ & డిస్టిలరీస్: 8.9% పెరుగుదలతో రూ. 590 టార్గెట్ ధర.
రాడికో ఖైతాన్ (Radico Khaitan): 13.5% పెరుగుదలతో రూ. 3,340 టార్గెట్ ధర.
*పైన ఈ పెరుగుదలలు.. బుధవారం ట్రేడింగ్ సెషన్తో పోల్చిన ధరలు.
ముహురత్ ట్రేడింగ్ ఎప్పుడు?
ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ అక్టోబర్ 21, మంగళవారం నాడు జరగనుంది. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ప్రధాన ట్రేడింగ్ సెషన్ ఉంటుంది.
(గమనిక- ఇది సమచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు సెబీ రిజస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


