అసోంలో భూకంపం.. మేఘాలయ వరకు ప్రకంపనలు

అసోంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. మేఘాలయ వరకు ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు త్రిపురాలో కూడా భూమి కంపించింది.

Published on: Jan 5, 2026, 05:29:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అసోంలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు, మోరిగావ్​లో భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మోలాజీ (ఎన్​సీఎస్​) ధ్రువీకరించింది.

అసోంలో భూకంపం... (Representational)
అసోంలో భూకంపం... (Representational)

ఎన్​సీఎస్​ ప్రకారం భూమికి 50 కి.మీల లోతున ఈ భూకంపం సంభవించింది. అసోంలోని అనేక జిల్లాలతో పాటు మేఘాలయలోని షిల్లాంగ్​ వరకు కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.

అసోం భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అంతకుముందు, సోమవారం తెల్లవారుజామున 3 గంటల 3 నిమిషాల ప్రాంతంలో త్రిపురాలో భూకంపం సంభవించింది. గోమటి అనే ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టార్​ స్కేల్​పై 3.9గా రికార్డు అయ్యింది.

నేపాల్​ని వణికించిన భూకంపాలు..

మరోవైపు జనవరి 3న రెండు భూకంపాలు నేపాల్​ ప్రజలను వణికించాయి. శనివారం ఉదయం పశ్చిమ నేపాల్​లోని తప్లేజంగ్​ జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటల 13 నిమిషాలకు భూమి కంపించింది.

ఇక శనివారం రాత్రి 10 గంటల 36 నిమిషాలకు తూర్పు నేపాల్​లోని ఉదయాపుర్​ జిల్లాలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టార్​ స్కేల్​పై 4.3గా నమోదైంది.

ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More