ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్లో పిచ్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో(MCG) జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేవలం పేసర్ల హవా నడుస్తుండటం, బ్యాటర్లు నిలవలేకపోతుండటంతో భారత మాజీ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించారు. ఉపఖండంలో స్పిన్ పిచ్లను విమర్శించే విదేశీయులు.. ఇప్పుడు పేస్ పిచ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
మరీ ఇంత దారుణంగానా?

యాషెస్ సిరీస్లో ఇది నాలుగో టెస్టు. పెర్త్ టెస్టు పిచ్పై ఇప్పటికే విమర్శలు రాగా.. ఇప్పుడు మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు పిచ్ కూడా బౌలర్లకు స్వర్గధామంగా, బ్యాటర్లకు నరకంగా మారింది. కేవలం రెండు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డే 1: మొదటి రోజే రెండు జట్లూ ఆలౌట్ అయ్యాయి. ఏకంగా 20 వికెట్లు పడ్డాయి.
డే 2: రెండో రోజు సగం ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కూడా ఆలౌట్ అయిపోయింది. మరో 10 వికెట్లు పడ్డాయి.
అంటే కేవలం ఒకటిన్నర రోజుల్లోనే 30 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లండ్ ముందు ఆస్ట్రేలియా కేవలం 175 పరుగుల లక్ష్యం ఉంచింది.
భారత మాజీల ఆగ్రహం: ఆ ద్వంద్వ వైఖరి ఏంటి?
భారత్లో మ్యాచ్ రెండో రోజే అయిపోతే లేదా స్పిన్ తిరిగితే.. "పిచ్ బాగోలేదు, స్పిన్కు అనుకూలంగా మార్చేశారు" అంటూ విదేశీ మీడియా గగ్గోలు పెడుతుంది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో పేస్కు అనుకూలంగా పిచ్ తయారు చేయడంపై భారత పండితులు కౌంటర్ ఇస్తున్నారు.
ఆకాశ్ చోప్రా మొదట ఓ ట్వీట్ చేశాడు. "టెస్ట్ మ్యాచ్ మొదలై ఒకటిన్నర రోజులు అవుతోంది.. ఒక్క ఓవర్ కూడా స్పిన్ వేయలేదు. అప్పుడే 27 వికెట్లు పడిపోయాయి. అదే మా ఉపఖండంలో (భారత్లో) ఒక్క ఓవర్ పేస్ వేయకుండా ఇన్ని వికెట్లు పడి ఉంటే.. ఈపాటికి ప్రపంచం తలకిందులయ్యేలా రచ్చ రచ్చ చేసేవారు కదా" అని అనడం గమనార్హం. రెండు జట్లు కేవలం పేసర్లనే నమ్ముకుని బరిలోకి దిగడాన్ని బట్టి పిచ్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక దినేశ్ కార్తీక్ కూడా దీనిపై స్పందించాడు. "ఎంసీజీ పిచ్ చాలా నాసిరకంగా ఉంది. నమ్మలేకపోతున్నా.. 4 టెస్టుల్లో 2 టెస్టులు కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోయేలా ఉన్నాయి. యాషెస్ సిరీస్ అంటే ఎంతో హైప్ ఉంటుంది.. కానీ ఇప్పటివరకు జరిగిన 4 టెస్టులు కలిపి చూస్తే కేవలం 13 రోజులే ఆట జరిగింది" అని కార్తీక్ అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు 95,000 మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తే.. వారికి పూర్తి స్థాయి మ్యాచ్ వినోదం దక్కడం లేదని అతడు అభిప్రాయపడ్డాడు.
{{/usCountry}}ఇక దినేశ్ కార్తీక్ కూడా దీనిపై స్పందించాడు. "ఎంసీజీ పిచ్ చాలా నాసిరకంగా ఉంది. నమ్మలేకపోతున్నా.. 4 టెస్టుల్లో 2 టెస్టులు కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోయేలా ఉన్నాయి. యాషెస్ సిరీస్ అంటే ఎంతో హైప్ ఉంటుంది.. కానీ ఇప్పటివరకు జరిగిన 4 టెస్టులు కలిపి చూస్తే కేవలం 13 రోజులే ఆట జరిగింది" అని కార్తీక్ అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు 95,000 మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తే.. వారికి పూర్తి స్థాయి మ్యాచ్ వినోదం దక్కడం లేదని అతడు అభిప్రాయపడ్డాడు.
{{/usCountry}}