మహిళలకు ఊరట: 175 రైల్వే స్టేషన్లలో ఉచిత శానిటరీ ప్యాడ్లు
మహిళా ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం నార్తర్న్ రైల్వేస్, ఇండస్ టవర్స్ సంస్థలు చేతులు కలిపాయి. 'నారీ సమ్మాన్' సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 175 రైల్వే స్టేషన్లలో 500 ఉచిత శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు.
రైలు ప్రయాణం చేసే మహిళలకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్ (Indus Towers) పెద్ద ఉపశమనం కలిగించాయి. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో నార్తర్న్ రైల్వేస్తో కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. 'నారీ సమ్మాన్' అనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పథకం కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణికులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లను అందిస్తున్నారు.
175 స్టేషన్లలో 500 వెండింగ్ మిషన్లు
ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ, ఫిరోజ్పూర్, అంబాలా, మొరాదాబాద్, లక్నో డివిజన్ల పరిధిలోని 175 రైల్వే స్టేషన్లలో మొత్తం 500 శానిటరీ నెప్కిన్ వెండింగ్ మిషన్లను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మిషన్లను సరికొత్త ఐఓటీ (IoT - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అనుసంధానించడం విశేషం. దీనివల్ల మిషన్లలో ప్యాడ్ల నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చు. ఇప్పటివరకు ఈ మిషన్ల ద్వారా దాదాపు 3 కోట్ల శానిటరీ నాప్కిన్లను మహిళా ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇండస్ టవర్స్ నిర్వహిస్తున్న 'ప్రగతి' అనే విస్తృత సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు నడుస్తోంది.
మహిళల గౌరవానికి ప్రథమ ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) లోని 'మెన్స్ట్రువల్ హైజీన్ స్కీమ్' (MHS) ఆశయాలకు అనుగుణంగా ఈ మౌలిక సదుపాయాలను రైల్వే స్టేషన్లలో కల్పిస్తున్నారు. ఇది ప్రజా రవాణా రంగంలో మహిళా కేంద్రీకృత వసతుల కల్పనకు అద్దం పడుతోంది.
"భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలు, విద్యార్థినులు ప్రయాణిస్తుంటారు. వారి సౌకర్యం, భద్రత, గౌరవానికి అండగా నిలవడమే మా ప్రథమ ప్రాధాన్యం. ఇండస్ టవర్స్తో కుదిరిన ఈ భాగస్వామ్యం ప్రజా రవాణా వ్యవస్థను మహిళలకు మరింత అనుకూలంగా మార్చడంలో ఒక కీలక అడుగు" అని నార్తర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాండే పేర్కొన్నారు.
రైల్వే స్టేషన్ల వంటి నిరంతరం రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి సదుపాయాలు కల్పించడం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఇండస్ టవర్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) తేజీందర్ కల్రా ఆనందం వ్యక్తం చేశారు.
"భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జోన్లలో ఈ ప్రాజెక్టును ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం మా సాంకేతిక, నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. ప్రయాణ సమయంలో ఇలాంటి సదుపాయాలు సులభంగా దొరికినప్పుడే మహిళల ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ లభిస్తుంది" అని తేజీందర్ కల్రా స్పష్టం చేశారు.
రైల్వేల్లో మహిళా ప్రయాణానికి కొత్త భరోసా
భారతీయ రైల్వేలు ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక కోచ్లు, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు పీరియడ్స్ సమయాల్లో ఇబ్బంది పడకుండా స్టేషన్లలోనే ఉచిత ప్యాడ్ల సదుపాయాన్ని చేర్చడం ప్రయాణ అనుభవాన్ని మరింత సురక్షితంగా మార్చనుంది. ఇండస్ టవర్స్ సంస్థ తన విస్తృత సామాజిక బాధ్యతలో భాగంగా 2030 నాటికి దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


