IPL 2026 : బెంగళూరు ఫ్యాన్స్​కి షాక్! అహ్మదాబాద్​లోనే ఐపీఎల్​ ఫైనల్​- ప్లేఆఫ్స్​ షెడ్యూల్​ ఇదే..

IPL 2026 playoffs : ఐపీఎల్​ 2026కి సంబంధించిన ప్లేఆఫ్స్​, ఫైనల్​ షెడ్యూల్​ తాజాగా వెలువడింది. అహ్మదాబాద్​ వేదికగా మే 31న ఐపీఎల్​ ఫైనల్​ జరగనుంది. 

Published on: May 6, 2026, 12:34:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026 final venue : ఐపీఎల్​ 2026కి సంబంధించి బిగ్​ అప్డేట్​! ప్రస్తుతం లీగ్​ దశలో ఉన్న ఈ మెగా క్రికెట్​ టోర్నీకి చెందిన ప్లేఆఫ్స్, ఫైనల్​ షెడ్యూల్​ని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. బెంగళూరు ఫ్యాన్స్​కి షాక్​ ఇస్తూ.. ఈ ఏడాది ఫైనల్​ని​ అహ్మదాబాద్​లో నిర్వహించాలని నిర్ణయించారు. మే 31న ఫైనల్​ మ్యాచ్​ ఉండనుంది.

ఐపీఎల్​ 2026 లేటెస్ట్​ అప్డేట్స్..
ఐపీఎల్​ 2026 లేటెస్ట్​ అప్డేట్స్..

ఐపీఎల్​ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్​ ఇలా..

మే 26న ధర్మశాల వేదికగా క్వాలిఫయర్​-1 మ్యాచ్​ జరగనుంది. ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​ టాప్​-2లో ఉన్న జట్లు ఇందులో పోటీపడతాయి. ఇక మే 27న, ఛండీగఢ్​లో ఎలిమినేటర్​ ఉండబోతోంది. టాప్​-3,4 జట్లు తలపడతాయి. ఓడిపోయిన వారు ఎలిమినేట్​ అవుతారు.

ఇక అదే వెన్యూలో మే 29న క్వాలిఫయర్​-2 మ్యాచ్​ ఉంటుంది. అంటే క్వాలిఫయర్-1 లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్​లో గెలిచిన జట్టుతో తలపడతుంది.

ఇక క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్​ల్లో గెలిచిన జట్లు అహ్మదాబాద్​ వేదికగా మే 31న ఫైనల్​లో తలపడనున్నాయి.

బెంగళూరు ఫ్యాన్స్​కి షాక్!

సాధారణంగా ముందు సీజన్​లో కప్​ గెలిచిన జట్టుకు సంబంధించిన హోమ్​ గ్రౌండ్​లో తదుపరి సీజన్ ఫైనల్​ జరుగుతుంటుంది. ఆ లెక్కన చూసుకుంటే.. ఐపీఎల్​ 2025లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు విజేతగా నిలిచింది కాబట్టి, ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్​ జరగాల్సి ఉంది. కానీ స్థానిక అసోసియేషన్లు, అధికారుల నుంచి డిమాండ్లు, రిక్వైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయని, అవి బీసీసీఐ చేతుల్లో కూడా లేవని, అందుకే ఐపీఎల్​ 2026 ఫైనల్​ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్​కి తరలించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఐపీఎల్​ 2026 ఫైనల్​ టికెట్ల కోసం ప్రముఖులు, అధికారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్ల వల్లే ఇలా జరిగిందని సోషల్​ మీడియాలో పుకార్లు జోరుగా సాగుతున్నాయి.

ఏదేమైన.. ఫైనల్​ తరలిపోవడం బెంగళూరులో ఐపీఎల్​ లవర్స్​కి షాక్​ ఇచ్చే విషయమే అని చెప్పుకోవాలి. పైగా డిఫెండింగ్​ ఛాంపియన్​గా బరిలో దిగిన ఆర్సీబీ, ఈసారి కూడా మంచి ఫామ్​లో ఉంది. ఈ జట్టు ఒకవేళ ఫైనల్​కి చేరుకుంటే, బెంగళూరు ఫ్యాన్స్​ మంచి అవకాశాన్ని మిస్​ చేసుకున్నట్టే!

ఐపీఎల్​ ఫైనల్​ అంటే అహ్మదాబాదే!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియంగా అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ 2026 కూడా కలుపుకుంటే.. 5ఏళ్లల్లో నాలుగు సార్లు ఈ స్టేడియమే ఐపీఎల్ ఫైనల్​ని హోస్ట్​ చేసినట్టు అవుతుంది.

  • 2022- గుజరాత్​ టైటాన్స్​ వర్సెస్​ రాజస్థాన్ రాయల్స్
  • 2023- చెన్నై సూపర్​ కింగ్స్​ వర్సెస్​ గుజరాత్​ టైటాన్స్
  • 2025- రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వర్సెస్ పంజాబ్​ కింగ్స్
  • 2026- ఫైనల్​కి వెళ్లే జట్లు తేలాల్సి ఉంది.

ఇలా చాలా వరకు కీలక మ్యాచ్​లు (2023 వన్డే ప్రపంచకప్​ ఫైనల్- 2025 టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్), ఐపీఎల్ ఫైనల్స్ అహ్మదాబాద్​కే వెళ్లిపోవడంపై సోషల్​ మీడియాలో అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతా అహ్మదాబాద్​కే ఇచ్చేస్తే, ఇతర నగరాల్లోని ఫ్యాన్స్​ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.

వీటన్నింటి మధ్య కూడా ఈ దఫా ఐపీఎల్​ ఫైనల్​ని సైతం అక్కడే జరపాలని బీసీసీఐ నిర్ణయించుకోవడం గమనార్హం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More