యువతలో ఆర్థిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (KSL) చేపట్టిన 'కోణా కోణా శిక్ష' పథకం సరికొత్త మైలురాయిని చేరుకుంది. జులై 2021లో ప్రారంభమైన ఈ ఫ్లాగ్షిప్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 3.6 లక్షల మంది యువతీ యువకులు ఆర్థిక అక్షరాస్యతను సాధించారు.

గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఈ కార్యక్రమం మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా 293 నగరాల్లోని 909 కళాశాలలకు చెందిన 72,624 మంది విద్యార్థులు ఈ శిక్షణ పొందినట్లు సంస్థ హైదరాబాద్ వేదికగా ప్రకటించింది.
10 గంటల ఉచిత కోర్సు - ఎన్ఐఎస్ఎమ్ (NISM) సర్టిఫికేషన్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ పథకం విద్యార్థులకు ఆచరణాత్మక ఆర్థిక నైపుణ్యాలను అందిస్తోంది.
శిక్షణ అంశాలు: వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ (Personal Finance), పెట్టుబడుల ప్రాథమిక సూత్రాలు (Investment Fundamentals), స్టాక్ మార్కెట్ ఆపరేషన్లు, ఫైనాన్షియల్ ప్లానింగ్.
సర్టిఫికేషన్: 10 గంటల ప్రత్యేక లెర్నింగ్ మోడ్యూల్ పూర్తయ్యాక ఆన్లైన్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పరిశ్రమ నిపుణులు గుర్తించే ఎన్ఐఎస్ఎమ్ సర్టిఫికెట్ అందజేస్తారు.
బాధ్యతాయుతమైన నిర్ణయాలే లక్ష్యం
"ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా తోడ్పడటమే మా ప్రధాన లక్ష్యం. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో యువత చిన్న వయసులోనే పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికపై అవగాహన పెంచుకోవడం అవసరం. కోణా కోణా శిక్ష ద్వారా రాబోయే తరానికి అవసరమైన ధైర్యాన్ని, నాలెడ్జ్ను అందిస్తున్నాం" అని కోటక్ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, శ్రీపాల్ షా తెలిపారు.
"లక్షలాది మంది భారతీయ యువతకు అవసరమైన ఆర్థిక నైపుణ్యాలను అందించడంలో కోటక్ సెక్యూరిటీస్తో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. ప్రతీ ఏటా విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఈ కార్యక్రమం ఎంత అవసరమో అర్థమవుతోంది." అని ఎన్ఐఎస్ఎమ్ (NISM) డైరెక్టర్ శశి కృష్ణన్ వివరించారు.
మార్కెట్లో బలమైన ముద్ర వేసిన కోటక్ సెక్యూరిటీస్
{{/usCountry}}"లక్షలాది మంది భారతీయ యువతకు అవసరమైన ఆర్థిక నైపుణ్యాలను అందించడంలో కోటక్ సెక్యూరిటీస్తో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. ప్రతీ ఏటా విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఈ కార్యక్రమం ఎంత అవసరమో అర్థమవుతోంది." అని ఎన్ఐఎస్ఎమ్ (NISM) డైరెక్టర్ శశి కృష్ణన్ వివరించారు.
మార్కెట్లో బలమైన ముద్ర వేసిన కోటక్ సెక్యూరిటీస్
{{/usCountry}}కోటక్ మహీంద్రా బ్యాంక్కు చెందిన అనుబంధ సంస్థ కోటక్ సెక్యూరిటీస్, దేశంలోనే ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సేవలందిస్తోంది. 2026 జూన్ 30 నాటికి లభించిన వివరాల ప్రకారం.. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 344 నగరాల్లో 148 సొంత శాఖలు, 1,297 మంది ఆథరైజ్డ్ ప్రతినిధులు ఉన్నారు. 67 లక్షలకు పైగా వినియోగదారులకు ఈక్విటీలు, డెరివేటివ్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక ఉత్పత్తుల సేవలను అందిస్తోంది.