స్టాక్ మార్కెట్ విశ్లేషణ: నిఫ్టీ 50 పతనం కానుందా? కీలక స్థాయిలు ఇవే
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. అయినప్పటికీ నిఫ్టీ 50 బలహీన సంకేతాలను చూపుతోంది. కీలక మద్దతు స్థాయిలు విచ్ఛిన్నమైతే సూచీ మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
శుక్రవారం (సెప్టెంబరు 11) ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ, చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించడం, తక్కువ ధరల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కొంత ఊరటనిచ్చింది. నిఫ్టీ 50 ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 0.72 శాతం మేర పుంజుకున్నప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి 80 పాయింట్లు (0.34 శాతం) క్షీణించి 23,398 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్, ముడి చమురు బాట
మరో వైపు సెన్సెక్స్ కూడా తన నష్టాలను చాలా వరకు తగ్గించుకొని 148 పాయింట్లు (0.16 శాతం) తగ్గి 74,754 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 2.3 శాతం తగ్గి బ్యారెల్కు 105.14 డాలర్లకు చేరింది. అంతకుముందు 108 డాలర్లను దాటిన చమురు ధరలు తిరిగి దిగిరావడం భారత మార్కెట్కు మద్దతుగా నిలిచింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరి చివర్లో బ్రెంట్ క్రూడ్ 72 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం 100 డాలర్ల పైన కొనసాగుతోంది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 2 శాతం తగ్గి 100.46 డాలర్లకు చేరింది.
నిఫ్టీ 50 సాంకేతిక చిత్రం: మద్దతు, నిరోధక స్థాయిలు
ప్రస్తుతం నిఫ్టీ 50 బలహీనమైన సాంకేతిక నిర్మాణాన్ని సూచిస్తోంది. ప్రధాన మూవింగ్ యావరేజ్ల కంటే దిగువన ట్రేడ్ అవుతుండటంతో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
"నిఫ్టీకి తక్షణ మద్దతు (Support) స్థాయి 23,200–23,250 వద్ద ఉంది. ఈ స్థాయి విచ్ఛిన్నమైతే, సూచీ 23,000–22,900 వద్దకు, ఆ తర్వాత 22,400 స్థాయిలకు దిగజారవచ్చు. పైకి వెళ్లే క్రమంలో 23,500 వద్ద తక్షణ నిరోధం (Resistance) ఎదురవుతుంది. ప్రధాన నిరోధకత 24,000–24,100 వద్ద ఉంది. 24,100 స్థాయిని స్థిరంగా దాటితేనే మార్కెట్ 24,300–24,350 వైపు ప్రయాణించే వీలుంది" అని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సీనియర్ మేనేజర్ (టెక్నికల్ రీసెర్చ్) జిగర్ ఎస్ పటేల్ విశ్లేషించారు.
ఆర్ఎస్ఐ (RSI) 25 సమీపంలో ఉండటం, డీఎమ్ఐ (DMI) బేరిష్ ట్రెండ్ను సూచిస్తుండటంతో పెట్టుబడిదారులు 23,200 సపోర్ట్, 24,100 రెసిస్టెన్స్ స్థాయిలను నిశితంగా గమనించాలని ఆయన సూచించారు.
పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి?
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి భారీ కొనుగోళ్లు చేయకూడదని ఛాయిస్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ హితేష్ టేలర్ స్పష్టం చేశారు. మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యేంత వరకు ఆగడం మంచిదని, విడతలవారీగా (Staggered approach) పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని పేర్కొన్నారు.
"నిఫ్టీ ప్రస్తుతం తన కీలక ఈఎమ్ఏ (EMA) స్థాయిల కంటే దిగువన ట్రేడ్ అవుతోంది. స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా ఉంది. 23,000–23,070 పరిధి కీలకమైన మద్దతు స్థాయిగా పనిచేస్తుంది. ఈ స్థాయిని నిలబెట్టుకుంటే సాంకేతిక రికవరీకి అవకాశం ఉంటుంది. లేకపోతే దిద్దుబాటు మరింత పెరిగే ప్రమాదం ఉంది" అని హితేష్ టేలర్ వివరించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


