...
...
Next Story

NTPC recruitment 2026 : ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్- ముఖ్యమైన తేదీలు, అర్హత, ఇతర వివరాలు..​

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 26, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 15, 2026, 14:02:51 IST
Advertisement

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC Limited) శుభవార్త చెప్పింది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (సీ అండ్ ఐ) విభాగాల్లో మొత్తం 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యుత్ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) విభాగంలో 40, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) విభాగంలో 55, అలాగే డిప్యూటీ మేనేజర్ (సీఅండ్ఐ) విభాగంలో 40 ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ 2026- అర్హతలు, వయసు వివరాలు..

ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ 2026లో భాగంగా ఎలక్ట్రికల్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు పవర్ సెక్టార్‌లో కనీసం 10 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండటం తప్పనిసరి.

మెకానికల్ పోస్టు కోసం, అభ్యర్థులు మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ కలిగి ఉండాలి. అలాగే పవర్ సెక్టార్‌లో కనీసం 10 సంవత్సరాల సంబంధిత ఎగ్జిక్యూటివ్ అనుభవం అవసరం.

సీ అండ్​ ఐ పోస్టు కోసం, అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ కలిగి ఉండాలి. దీనికి కూడా పవర్ సెక్టార్‌లో 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

ఆసక్తి గల అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్‌లోని కెరీర్స్ సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 12, 2026న ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు ఆగస్టు 26, 2026 తుది గడువుగా ఉందని గుర్తుపెట్టుకోవాలి.

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని అవసరమైన ధ్రువపత్రాలను సరిగ్గా అప్‌లోడ్ చేయాలి. అసంపూర్ణమైన లేదా తగిన పత్రాలు లేని దరఖాస్తులను తిరస్కరిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి అన్ని అర్హతలు సరిపోతున్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.

ఎన్టీపీసీ రిక్రూట్​మెంట్​ 2026 అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe