...
...
Next Story

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏ దేశం నుంచి కూడా మేం సాయం తీసుకోలేదు : పాక్ ఆర్మీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ సమయంలో మేం ఏ దేశం నుండి సహాయం తీసుకోలేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చెప్పారు. పాకిస్థాన్ భారతదేశంతో ఒంటరిగా పోరాడిందని ఆయన అన్నారు.

Published on: Jul 7, 2025, 20:49:17 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, టర్కీ పాకిస్థాన్‌కు సహాయం చేశాయని వార్తలు వచ్చాయి. దీనిపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. చైనా, టర్కీ నుండి తమకు ఎటువంటి సహాయం రాలేదని వివరించడానికి ప్రయత్నించాడు.​ తాము ఏ దేశం నుంచి సాయం తీసుకోలేదని చెప్పారు.​​​​​​​​

అసిమ్ మునీర్
అసిమ్ మునీర్

ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు చురుకుగా మద్దతు ఇచ్చిందని, లైవ్ ల్యాబ్ లాగా దాని ఆయుధాలను పరీక్షిస్తోందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్పారు. తర్వాత అసిమ్ మునీర్ ఈ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంలో టర్కీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని భారత సైనిక అధికారి తెలిపారు .

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. 'పాకిస్థాన్‌కు ఏదైనా బయటి దేశం నుండి మద్దతు లభించిందనే భారతదేశం వాదన పూర్తిగా తప్పు. పాకిస్థాన్‌ సైనిక బలం దాని స్వంత కృషి, వ్యూహాత్మక సామర్థ్యంతో ఉంది . పాకిస్థాన్ చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తోంది.' అని అన్నారు.

అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏదైనా రెచ్చగొట్టే చర్యతో ప్రతిస్పందిస్తామని మరోసారి బెదిరింపు జారీ చేశారు. 'మన సైనిక స్థావరాలు, ఆర్థిక కేంద్రాలు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగితే వెంటనే స్పందిస్తాం.' అని అన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ మే 7న ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం పాకిస్థాన్, పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది . దీనితో ఆగ్రహించిన పాకిస్థాన్ సైన్యం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధం తర్వాత మే 10న భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe