వీసా జాప్యం వేళ శుభవార్త: ప్రాడిజీ ఫైనాన్స్ స్ప్రింగ్ లోన్ దరఖాస్తులు ప్రారంభం

అమెరికా, ఆస్ట్రేలియా వీసాల ఆలస్యంతో విదేశీ విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ప్రాడిజీ ఫైనాన్స్ ఊరటనిచ్చింది. విద్యార్థులు వీసా, ఫండింగ్ సమస్యలు లేకుండా ముందే ప్లాన్ చేసుకునేలా స్ప్రింగ్ ఇన్ టేక్ అప్లికేషన్లను సెప్టెంబరు 1 నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published on: Sep 2, 2026, 11:03:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లండన్, సెప్టెంబరు 26: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసా జాప్యం పెద్ద నిరాశను మిగులుస్తోంది. ఈ ఏడాది ఫాల్ (Fall) సీజన్‌లో చాలామంది భారతీయ విద్యార్థులు వీసా అపాయింట్‌మెంట్లు లభించక, ప్రాసెసింగ్ ఆలస్యమై తమ చదువులను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఊరటనిస్తూ ప్రముఖ విదేశీ విద్యా రుణాల సంస్థ 'ప్రాడిజీ ఫైనాన్స్' (Prodigy Finance) కీలక నిర్ణయం తీసుకుంది. స్ప్రింగ్ (Spring) ఇన్ టేక్ కోసం విద్యా రుణాల దరఖాస్తులను నిర్దేశిత సమయం కంటే ముందే అందుబాటులోకి తీసుకొచ్చింది.

వీసా జాప్యం వేళ శుభవార్త: ప్రాడిజీ ఫైనాన్స్ స్ప్రింగ్ లోన్ దరఖాస్తులు ప్రారంభం
వీసా జాప్యం వేళ శుభవార్త: ప్రాడిజీ ఫైనాన్స్ స్ప్రింగ్ లోన్ దరఖాస్తులు ప్రారంభం

విద్యార్థులకు ముందస్తు అవకాశం

విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు పొంది, వీసా ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 1, 2026 నుంచే స్ప్రింగ్ ఇన్ టేక్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. ఫాల్ సీజన్ దరఖాస్తులను వాయిదా (Defer) వేసుకున్న వారికి, అలాగే కొత్తగా స్ప్రింగ్ సీజన్‌కు దరఖాస్తు చేసుకునే వారికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

పూచీకత్తు లేకుండానే 2,20,000 డాలర్ల రుణం

ప్రాడిజీ ఫైనాన్స్ ద్వారా అర్హులైన విద్యార్థులు ఎటువంటి పూచీకత్తు (Collateral) లేదా గ్యారెంటర్ (Co-signer) లేకుండానే 2,20,000 అమెరికన్ డాలర్ల (USD) వరకు రుణం పొందవచ్చు. విద్యార్థులు చదివే దేశ మారకద్రవ్యంలోనే నిధులు విడుదల చేస్తారు. రూపాయి విలువ క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతీయ విద్యార్థులకు ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. 2007 నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ 150కి పైగా దేశాలకు చెందిన 47,000 మందికి పైగా విద్యార్థులకు 2.6 బిలియన్ డాలర్ల రుణాలను అందించింది.

వీసా ఆలస్యమే ప్రధాన సవాలు

అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం.. వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో ఆలస్యం, నిరాకరణల వల్లే అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు తగ్గుతున్నట్లు మెజారిటీ విశ్వవిద్యాలయాలు వెల్లడించాయి. కేవలం అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీసా ప్రాసెసింగ్‌కు కొన్ని కేసుల్లో ఏడాది సమయం పడుతున్నందున విద్యార్థులు ముందస్తుగానే ప్లాన్ చేసుకోవడం అవసరం.

"చివరి నిమిషం వరకు వేచి చూడవద్దు"

"వీసా ప్రాసెసింగ్‌లో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు వీలైనంత త్వరగా ఆర్థిక సదుపాయం, వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది" అని ప్రాడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ పేర్కొన్నారు. "అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వీసా వ్యవధి పెరుగుతోంది. యూకే వెళ్లే విద్యార్థుల కోసం అడ్వాన్స్ డిపాజిట్ మినహాయింపు ఆప్షన్లను కూడా అందిస్తున్నాం" అని ఆమె వివరించారు. ఎటువంటి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా అధికారిక ఛానెళ్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

అర్హత కలిగిన విద్యార్థులు prodigyfinance వెబ్‌సైట్ లేదా info@prodigyfinance.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More