...
...
Next Story

జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు - జీతం రూ. 35 వేలు, ముఖ్య వివరాలివే

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 20 అసిస్టెంట్ వార్డెన్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. www.pjtau.edu.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published on: Jun 15, 2025, 10:29:49 IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే రిక్రూట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూనివర్శిటీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రం
  • ఉద్యోగాల పేరు - అసిస్టెంట్ వార్డెన్స్.
  • మొత్తం ఖాళీలు - 20 (10 మంది మహిళా అభ్యర్థులు, 10 మంది పురుషులు).
  • అర్హతలు - ఎంఏ సోషియాలజీ లేదా ఎంఏ సోషల్ వర్క్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హానర్స్(కమ్యూనిటీ సైన్స్).
  • రిక్రూట్ మెంట్ విధానం - ఇంటర్వ్యూల ద్వారా
  • పని చేయాల్సిన ప్రాంతాలు - రాజేంద్రనగర్, హైదరాబాద్, అశ్వరావుపేట, జగిత్యాల, పాలెం, వరంగల్, సిరిసిల్ల, కంది, రుద్రూర్, ఆదిలాబాద్.
  • నెల జీతం - రూ. 35 వేలు
  • పని సమయాలు - ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10.30 గంటలు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
  • ఇంటర్వ్యూ తేదీ - జూన్ 20, 2025(సమయం ఉదయం 10 గంటలు)
  • ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం -నాల్డెజ్ మేనేజ్మెంట్ సెంటర్, పీజేటీఏయూ క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
  • ఇంటర్వ్యులకు వచ్చే అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలు తీసుకురావాలి. ధ్రువపత్రాలను జిరాక్స్ తీసుకుని అటెస్ట్ చేయించుకోవాలి. వీటితో పాటుఆధార్, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు కాపీలు ఉండాలి.
  • అప్లికేషన్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఉండాలి.
  • అధికారిక వెబ్ సైట్ లింక్ - https://www.pjtau.edu.in/index.html

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe