Stock market : ట్రేడర్స్ అలర్ట్- నేడు ట్రాక్ చేయాల్సిన 10 స్టాక్స్ ఇవే..
సెప్టెంబర్ 18, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 22 పాయింట్లు పడి 74,315 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 53 పాయింట్లు పెరిగి 23,271 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 237 పాయింట్లు పడి 56,056 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,208.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,617.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.61 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.14శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.69 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 0.86 శాతం పడి బ్యారెల్కి 107.4 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ప్రైమ్ ఫోకస్- బై రూ. 319, స్టాప్ లాస్ రూ. 305, టార్గెట్ రూ. 345
ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్- బై రూ. 420, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 460
పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్- బై రూ. 610, స్టాప్ లాస్ రూ. 580, టార్గెట్ రూ. 650
మాన్కైండ్ ఫార్మా- బై రూ. 2280, స్టాప్ లాస్ రూ. 2200, టార్గెట్ రూ. 3380
బీఈఎంఎల్- బై రూ. 2080, స్టాప్ లాస్ రూ. 2020, టార్గెట్ రూ. 2280
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్- బై రూ. 719, స్టాప్ లాస్ రూ. 694, టార్గెట్ రూ. 770
పరాదీప్ ఫాస్ఫేట్స్- బై రూ. 154, స్టాప్ లాస్ రూ. 148, టార్గెట్ రూ. 165
వెల్స్పన్ లివింగ్- బై రూ. 212, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 227
కేన్స్ టెక్నాలజీ ఇండియా- బై రూ. 3520, స్టాప్ లాస్ రూ. 3396, టార్గెట్ రూ. 3765
సీడీఎస్ఎల్- బై రూ. 1350, స్టాప్ లాస్ రూ. 1302, టార్గెట్ రూ. 1445
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


