రెరా వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: "బిల్డర్లకు కొమ్ముకాస్తున్నారు..’’
దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (RERA) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది సామాన్య కొనుగోలుదారుల కంటే డిఫాల్ట్ బిల్డర్లకే ఎక్కువ సహకరిస్తోందని, రిటైర్డ్ అధికారులకు 'పునరావాస కేంద్రం'గా మారిందని ధ్వజమెత్తింది.
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం, సామాన్య కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన 'రేరా' (RERA) వ్యవస్థ ప్రస్తుతం తన ఉద్దేశ్యాన్ని కోల్పోయిందని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవస్థ కేవలం నిబంధనలు ఉల్లంఘించే బిల్డర్లకు ఒక వరప్రదాయినిలా మారిందని, దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేకపోతే దాన్ని రద్దు చేసినా తమకు అభ్యంతరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

"రిటైర్డ్ అధికారులకు పునరావాస కేంద్రాలా?"
హిమాచల్ ప్రదేశ్ రేరా కార్యాలయాన్ని షిమ్లా నుంచి ధర్మశాలకు తరలించే విషయంలో దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
పనితీరుపై అసహనం:
"బిల్డర్లకు సహకరించడం తప్ప ఈ సంస్థలు మరేమీ చేయడం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇవి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
బాధితుల ఆవేదన: ఈ సంస్థ ఎవరి కోసమైతే పుట్టిందో, ఆ సామాన్య ప్రజలు ప్రస్తుతం తీవ్ర నిరాశలో, విరక్తిలో ఉన్నారని.. వారికి ఎక్కడా ప్రభావవంతమైన ఉపశమనం లభించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
నిర్మాణంలో మార్పు: రేరా వ్యవస్థను తిరిగి సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రాలకు కోర్టు సూచించింది.
హిమాచల్ రేరా తరలింపునకు గ్రీన్ సిగ్నల్
షిమ్లాలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు రేరా కార్యాలయాన్ని ధర్మశాలకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో హిమాచల్ హైకోర్టు ఈ తరలింపుపై ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
"ఒక కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలనేది పూర్తిగా పరిపాలనాపరమైన, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇందులో న్యాయస్థానాల జోక్యం అవసరం లేదు" అని ధర్మాసనం పేర్కొంది. బాధితులకు ఇబ్బంది కలగకుండా అప్పీలేట్ అధికారాలను కూడా ధర్మశాల జిల్లా జడ్జికి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే, ఈ అథారిటీల్లో రిటైర్డ్ బ్యూరోక్రాట్ల కంటే పర్యావరణ స్పృహ ఉన్న ఆర్కిటెక్టులు, నిపుణుల సేవలను వాడుకుంటేనే ఆయా ప్రాంతాల అభివృద్ధికి మేలు జరుగుతుందని హితవు పలికింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


