‘ఎంత తాగావ్​ బాబు?’- కదులుతున్న కారు డోర్​ తీసి రోడ్డు మీద మూత్రవిసర్జన చేసిన వ్యక్తి!

గురుగ్రామ్​లో సిగ్గుచోటు ఘటన చోటుచేసుకుంది! కదులుతున్న కారులో నుంచి ఓ వ్యక్తి రోడ్డు మీద మూత్రవిసర్జన చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘటనపై పోలీసు కేసు కూడా నమోదైంది.

Published on: Oct 24, 2025, 09:10:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో ‘సివిక్​ సెన్స్​’పై ఇటీవల ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో గురుగ్రామ్​లో ఒక సిగ్గుచేటు ఘటన చోటుచేసుకుంది! ఓ వ్యక్తి.. కదులుతున్న కారు డోర్​ ఓపెన్​ చేసి రోడ్డు మీద మూత్రవిసర్జన చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

వైరల్​ వీడియోలోని దృశ్యం..
వైరల్​ వీడియోలోని దృశ్యం..

అసలేం జరిగింది?

సదరు కారు వెనక వెళుతున్న మరో వాహనంలోని ప్రయాణికుడు ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. వీడియోలో ఉన్న మహీంద్రా థార్.. గురుగ్రామ్​​ సోహ్నా చౌక్​ నుంచి శివ్​ మూర్తి వైపు ప్రయాణిస్తుండగా సదర్​ బజార్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

వీడియోలో ముందు ఒక నల్లటి మహీంద్రా థార్​ కనిపిస్తోంది. అందులో ఒక తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి నిలబడ్డాడు. పక్కనే మరో వ్యక్తి సైకిల్​ తొక్కుతున్నట్టు కూడా కనిపిస్తోంది. సైకిల్​ తొక్కుతున్న వ్యక్తిని సైతం విస్మరించి, కారులోని సదరు వ్యక్తి ప్యాంటు జిప్పు ఓపెన్​ చేసి, రోడ్డు మూత్రవిసర్జన చేయడం మొదలుపెట్టాడు.

ఈ వీడియోకి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో ఇన్​స్టెంట్​గా వైరల్​ అయ్యాయి.

ఆ మహీంద్రా థార్​లో మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కారు లోపల మద్యం సీసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్​ మద్యం తాగి బండి నడిపాడా? అన్న విషయం తెలియరాలేదు. కానీ కారు నుంచి మూత్రవిసర్జన చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉండే అవకాశం ఉంది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

ఎఫ్​ఐఆర్​ నమోదు..

కారులో నుంచి మూత్రవిసర్జన చేసిన వ్యక్తి వీడియో వైరల్​ అయిన అనంతరం ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్టు వివరించారు.

“వైరల్​ వీడియోని వెరిఫై చేసి ఎస్​యూవీ రిజిస్ట్రేషన్​ నెంబర్​ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. న్యూ కాలనీ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశాము. మద్యం తాగి ఈ పని చేశాడా? అన్న దానిపై విచారణ చేస్తున్నాము,” అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

దుకాణాలు, నివాసాలు ఉన్న రద్దీ ప్రాంతంలో ఆ కారు అతి వేగంగా వెళుతోందని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు స్థానిక సీసీటీవీ పుటేజీలను చూస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై స్థానిక దుకాణదారులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఇది సిగ్గుచేటు మాత్రమే కాదు ప్రజా భద్రతకు ముప్పు,” అని ఒకరు అభిప్రాయపడ్డారు.

“ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదంటే, ఆ వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి,” అని మరొకరు పేర్కొన్నారు.

భారతీయుల ‘సివిక్​ సెన్స్​’పై ఇటీవలి కాలంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు మీద చెత్త పడేయడం దగ్గరి నుంచి, ట్రాఫిక్​ రూల్స్​ పాటించకపోవడం, ప్రమాదకరంగా రీల్స్​ చేస్తుండటం వరకు అనేక విషయాల్లో ప్రజలు దేశం పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజా ఘటన సైతం ఈ కోవలోకే చేరింది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More