టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ నెలకొన్ని కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే ఈ వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాక్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు విప్పాడు. వి ఆర్ విత్ బంగ్లాదేశ్ అంటూ మాట్లాడాడు.
ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఆడటంపైనే ఫస్ట్ డౌట్లు వచ్చాయి. కానీ టోర్నీలో ఆడతామని, ఇండియాతో మ్యాచ్ ను మాత్రం బాయ్ కాట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 15 న కొలంబోలో చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ కు మైదానంలోకి దిగమని చెప్పింది. దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ మాట్లాడారు.
ప్రధాని కామెంట్లు
‘‘ఐసీసీకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఈ నిర్ణయం (ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్) తీసుకుంది. క్రీడల్లో రాజకీయాలను భాగం చేయొద్దు. ఇదే మా స్పష్టమైన వైఖరి. ఎంతో జాగ్రత్తగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం బంగ్లాదేశ్ తో ఉన్నాం (వి ఆర్ విత్ బంగ్లాదేశ్). ఇది సరైన నిర్ణయమని నేను భావిస్తున్నా’’ అని ఫెడరల్ క్యాబినేట్ మీటింగ్ లో షెహబాజ్ పేర్కొన్నాడు.
అసలు ఏమైందంటే?
బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ వేటు వేసింది. దీంతో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చూపించి ఇండియాలో వరల్డ్ కప్ ఆడలేమని, తమ మ్యాచ్ లను వేరే చోటుకు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రిక్వెస్ట్ చేసింది. అయితే ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ ను టోర్నీ నుంచి తప్పించి, స్కాట్లాండ్ కు ఛాన్స్ ఇచ్చింది. దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఐసీసీ రియాక్షన్
టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేయడంపై ఐసీసీ సీరియస్ అయింది. మరోసారి నిర్ణయాన్ని రివ్యూ చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. లేదంటే దీని ప్రభావం సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కానీ దీనిపై ఇంకా పాకిస్థాన్ రియాక్టవలేదు. ఈ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది.
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేయడంపై ఐసీసీ సీరియస్ అయింది. మరోసారి నిర్ణయాన్ని రివ్యూ చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. లేదంటే దీని ప్రభావం సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కానీ దీనిపై ఇంకా పాకిస్థాన్ రియాక్టవలేదు. ఈ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది.
{{/usCountry}}