టెన్త్ విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు - ఏపీ విద్యాశాఖ కసరత్తు..!
ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనుంది. మరోవైపు ఇప్పట్నుంచి పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనుంది. ఈ సరికొత్త విధానంపై త్వరలోనే పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేయనుంది.
టీచర్లకు వచ్చే గ్రేడ్ల ఆధారంగా వారి పని తీరును కూడా అంచనా వేస్తారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉత్తమ టీచర్ అవార్డులకు సైతం దీన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశాలున్నాయి.
మరోవైపు టెన్త్ వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ఇప్పట్నుంచే కసరత్తు చేస్తోంది.ఇన్విజిలేషన్ డ్యూటీల కోసం రాష్ట్రస్థాయి నుంచే పంపనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి సైతం రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచే టీచర్లను ఎంపిక చేస్తారు.
వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే తెలిపింది.
ప్రస్తుతం రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు టెన్త్ విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీ కూడా దాటితే రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది.
వార్షిక పరీక్షల ఫీజును https://bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముందుగానే ఫీజులు చెల్లించుకోవాలని సూచిస్తున్నారు.
E-Paper

