'తల్లికి వందనం స్కీమ్'కు ఆధార్ లింకింగ్ తప్పనిసరి...! NPCI ప్రాసెస్ ఇలా చేసుకోండి

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh
Published on Jun 05, 2025 10:41 am IST

ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ నెలలోనే ప్రారంభించనుంది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాల్సి ఉంది. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 6
<p>బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్(NPCI) చేయించేందుకు లబ్దిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ లోనే చేసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా NPCI అధికారిక వెబ్ సైట్ <a href="https://www.npci.org.in/" target="_blank">https://www.npci.org.in/</a> లోకి వెళ్లాలి.హోమ్ పేజీలో 'Consumer' ఆప్షన్ పై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పై స్టేటస్ బార్ లో మీకు 'Bharat Aadhar Seeding Enabler(BASE)' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ నొక్కాలి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 10:41 am IST

బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్(NPCI) చేయించేందుకు లబ్దిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ లోనే చేసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా NPCI అధికారిక వెబ్ సైట్ https://www.npci.org.in/ లోకి వెళ్లాలి.హోమ్ పేజీలో 'Consumer' ఆప్షన్ పై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పై స్టేటస్ బార్ లో మీకు 'Bharat Aadhar Seeding Enabler(BASE)' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ నొక్కాలి.

2 / 6
<div><p>లబ్దిదారుల ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకు మాత్రమే సంక్షేమ పథకాల డబ్బులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సిలిండర్ నగదు జమ చేస్తుంది. ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ(ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్) లింక్ చేసుకోవాలని సూచించింది. ఎన్పీసీఐ లింక్ ఉన్న వారికే నగదు జమ అవుతుంది. ఇదే మాదిరిగా తల్లికి వందనం స్కీమ్ లోనూ లింకింగ్ ప్రాసెస్ ను తప్పనిసరి చేస్తోంది. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 10:41 am IST

లబ్దిదారుల ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకు మాత్రమే సంక్షేమ పథకాల డబ్బులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సిలిండర్ నగదు జమ చేస్తుంది. ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ(ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్) లింక్ చేసుకోవాలని సూచించింది. ఎన్పీసీఐ లింక్ ఉన్న వారికే నగదు జమ అవుతుంది. ఇదే మాదిరిగా తల్లికి వందనం స్కీమ్ లోనూ లింకింగ్ ప్రాసెస్ ను తప్పనిసరి చేస్తోంది.

3 / 6
<p>ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Seeding" ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి 'Fresh Seeding' ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పీసీఐ లింక్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. సబ్మిట్ చేసిన 24 గంటలలోపు ఎన్పీసీఐ లింక్ అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 10:41 am IST

ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Seeding" ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి 'Fresh Seeding' ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పీసీఐ లింక్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. సబ్మిట్ చేసిన 24 గంటలలోపు ఎన్పీసీఐ లింక్ అవుతుంది.

4 / 6
<p>ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే ఎన్పీసీఐ రిక్వెస్ట్ పంపేందుకు అవకాశం ఉంటుంది. NPCI లింక్ చేసుకునేందుకు కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ లో రావడం లేదు. అలాంటి వారు నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీసీఐ లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. <a href="https://base.npci.org.in/base/homepage" target="_blank">https://base.npci.org.in/base/homepage</a> లింక్ పై క్లిక్ చేసి స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 10:41 am IST

ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే ఎన్పీసీఐ రిక్వెస్ట్ పంపేందుకు అవకాశం ఉంటుంది. NPCI లింక్ చేసుకునేందుకు కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ లో రావడం లేదు. అలాంటి వారు నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీసీఐ లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. https://base.npci.org.in/base/homepage లింక్ పై క్లిక్ చేసి స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.

5 / 6
<p>మరోవైపు లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 10:41 am IST

మరోవైపు లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

6 / 6
<div><p>ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి…</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 10:41 am IST

ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి…

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!