'రైతు భరోసా స్కీమ్' అప్డేట్ - కొత్తగా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్…! ఈ పత్రాలుంటే చాలు

Published on Jun 13, 2025 10:33 am IST

వానాకాలం సీజన్ రావటంతో రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈసారి తొందరగానే విడుదల చేయాలని భావిస్తోంది. మరోవైపు రైతు భరోసా స్కీమ్ కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

1 / 8
<p>పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ స్కీమ్ రైతుబంధుగా ఉండేది. ప్రస్తుతం అర్హులైన అర్హులకు ఎకరానికి రూ. 6 వేలు అందజేయనున్నారు. </p>(image source unsplash) expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ స్కీమ్ రైతుబంధుగా ఉండేది. ప్రస్తుతం అర్హులైన అర్హులకు ఎకరానికి రూ. 6 వేలు అందజేయనున్నారు.

(image source unsplash)

2 / 8
<p>భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.ఎలాంటి మధ్యువర్తుల ప్రమేయం ఉండదు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.ఎలాంటి మధ్యువర్తుల ప్రమేయం ఉండదు.

3 / 8
<p>.ఈ స్కీమ్ కు సంబంధించి తెలంగాణ వ్యవసాయశాఖ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది. 05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.</p>(image source unsplash.com) expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

.ఈ స్కీమ్ కు సంబంధించి తెలంగాణ వ్యవసాయశాఖ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది. 05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

(image source unsplash.com)

4 / 8
<p>వానాకాలం సీజన్ రావటంతో రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. సాగుబాటు చేస్తూ… విత్తనాలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో పంటపెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ముందుగానే నిధులను జమ చేయాలని చూస్తోంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

వానాకాలం సీజన్ రావటంతో రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. సాగుబాటు చేస్తూ… విత్తనాలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో పంటపెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ముందుగానే నిధులను జమ చేయాలని చూస్తోంది.

5 / 8
<p>గతంలో రైతుబంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా కొత్త రైతులు వారి వివరాలను అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల విషయంపై రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలానికి చెందిన వ్యవసాయ అధికారులతో HT తెలుగు మాట్లాడింది. త్వరగా దరఖాస్తు చేసుకుంటే వివరాలు అప్డేట్ అవుతాయని, పెట్టుబడి సాయం అందే విషయంలో ఇబ్బందులు రావని వెల్లడించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

గతంలో రైతుబంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా కొత్త రైతులు వారి వివరాలను అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల విషయంపై రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలానికి చెందిన వ్యవసాయ అధికారులతో HT తెలుగు మాట్లాడింది. త్వరగా దరఖాస్తు చేసుకుంటే వివరాలు అప్డేట్ అవుతాయని, పెట్టుబడి సాయం అందే విషయంలో ఇబ్బందులు రావని వెల్లడించారు.

6 / 8
<p>రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.

7 / 8
<p>గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

8 / 8
<p>కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 13, 2025 10:33 am IST

కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!