...
...
Next Story

Electric scooters : ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో వాయిస్ కమాండ్ ఫీచర్.. ఇక మాట్లాడితే చాలు అన్నీ సెట్!

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' తన స్కూటర్ల కోసం సరికొత్త 'వాయిస్ ఆన్ ఏథర్' ఫీచర్‌ను విడుదల చేసింది. భారతీయుల యాసను అర్థం చేసుకునే ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ ఫీచర్ వివరాలు ఇవే..

Published on: Jun 11, 2026, 12:21:31 IST
Advertisement
<p>భారత ఈవీ రంగంలో వినూత్న సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ‘ఏథర్ ఎనర్జీ’ తన కస్టమర్ల కోసం మరో సూపర్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాయిస్ కమాండ్ ఫీచర్‌ను ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. 'వాయిస్ ఆన్ ఏథర్' పేరుతో పిలిచే ఈ సరికొత్త టెక్నాలజీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450 అపెక్స్, ఏథర్ రిజ్టా జెడ్ మోడళ్లలో అందుబాటులోకి వస్తోంది. జెన్ 3 లేదా అంతకంటే కొత్త హార్డ్‌వేర్ ఉన్న స్కూటర్లకు ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా కంపెనీ ఈ ఫీచర్‌ను అందిస్తోంది. రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సులభంగా మార్చడమే లక్ష్యంగా ఏథర్ ఈ అడుగు వేసింది.</p>

భారత ఈవీ రంగంలో వినూత్న సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ‘ఏథర్ ఎనర్జీ’ తన కస్టమర్ల కోసం మరో సూపర్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాయిస్ కమాండ్ ఫీచర్‌ను ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. 'వాయిస్ ఆన్ ఏథర్' పేరుతో పిలిచే ఈ సరికొత్త టెక్నాలజీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450 అపెక్స్, ఏథర్ రిజ్టా జెడ్ మోడళ్లలో అందుబాటులోకి వస్తోంది. జెన్ 3 లేదా అంతకంటే కొత్త హార్డ్‌వేర్ ఉన్న స్కూటర్లకు ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా కంపెనీ ఈ ఫీచర్‌ను అందిస్తోంది. రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సులభంగా మార్చడమే లక్ష్యంగా ఏథర్ ఈ అడుగు వేసింది.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'ఏథర్ కమ్యూనిటీ డే' వేడుకల్లో భాగంగా ఏథర్‌స్టాక్ 7 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పాటు ఈ వాయిస్ కమాండ్ ఫీచర్‌ను కంపెనీ మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సంస్థ. ఇప్పుడు అధికారికంగా రోల్ అవుట్ ప్రారంభం కావడంతో ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450 అపెక్స్, ఏథర్ రిజ్టా జెడ్ స్కూటర్ల యజమానులు తమ వాహనాలతో నేరుగా మాట్లాడవచ్చు. దీనివల్ల ప్రయాణంలో ఉన్నప్పుడు పదే పదే టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, బేస్ మోడళ్లు అయిన ఏథర్ 450ఎస్, ఏథర్ రిజ్టా ఎస్ స్కూటర్లలో మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

వాయిస్ ఆన్ ఏథర్ సిస్టమ్ వెనుక ఒక పవర్‌ఫుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పనిచేస్తోంది. ముఖ్యంగా భారతీయుల విభిన్న ఇంగ్లీష్ యాసలను, మాట్లాడే విధానాన్ని సులభంగా అర్థం చేసుకునేలా ఈ ఏఐ వ్యవస్థకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీనికోసం యూజర్లు ఏదో రొబోట్ లాగా నిర్దేశిత కమాండ్స్ చెప్పాల్సిన పనిలేదు, సాధారణంగా మనం ఇతరులతో మాట్లాడినట్లే స్కూటర్‌తోనూ మాట్లాడవచ్చు.

ఈ ఫీచర్ సహాయంతో రైడర్లు ప్రయాణంలో ఉన్నప్పుడు.. జీపీఎస్ నావిగేషన్ ఆన్ చేయడం- దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్లను వెతకడం, గమ్యస్థానానికి చేరుకునే అంచనా సమయాన్ని (ఈటీఏ) తెలుసుకోవడం, స్కూటర్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను మార్చడం, రైడింగ్ మోడ్స్- ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్స్‌ను కంట్రోల్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడటం, నోటిఫికేషన్లను మేనేజ్ చేయడం, మ్యూజిక్ ప్లేబ్యాక్- పాటలను మార్చడం వంటివి చేయవచ్చు.

ఉదాహరణకు, రైడర్లు ప్రయాణిస్తూనే "వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఛార్జర్?" అని అడగవచ్చు. లేదా "ఇంక్రీజ్ బ్రైట్‌నెస్", "ఛేంజ్ ట్రాక్షన్ కంట్రోల్ టు రెయిన్ మోడ్" అని చెప్తే చాలు, స్కూటర్ ఆటోమేటిక్‌గా ఆ సెట్టింగ్స్‌ను మార్చేస్తుంది!

ఈ వాయిస్ కమాండ్ ఫీచర్ ఏథర్ సంస్థ స్వంతంగా తయారు చేసిన ‘హాలో’ స్మార్ట్ హెల్మెట్‌తో ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం హాలో హెల్మెట్ మాత్రమే కాకుండా, సాధారణ మార్కెట్లో దొరికే ఏ థర్డ్-పార్టీ బ్లూటూత్ హెడ్‌సెట్‌లకైనా ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకంగా కొత్త హార్డ్‌వేర్ ఏదీ కొనాల్సిన అవసరం లేదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe