రేపటి నుంచే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు- 10, 12వ తరగతి విద్యార్థులు ఇవి తెలుసుకోవాలి..
దేశవ్యాప్తంగా ఎగ్జామ్ సీజన్కు సమయం ఆసన్నమైంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రేపు, ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో 10, 12వ తరగతి విద్యార్థులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి..
సీబీఎస్ఈ సూచనల ప్రకారం.. పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకల్లా చేరుకోవాలి. 10:00 గంటలు దాటిన తర్వాత ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని సీబీఎస్ఈ తేల్చి చెప్పింది.
"ఇండియా వ్యాప్తంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అత్యున్నత స్థాయి సమావేశాలు, ఇతర ఈవెంట్లు ఉంటాయి. దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. స్థానిక పరిస్థితులు, వాతావరణం, ట్రాఫిక్, దూరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇంటి నుంచి ముందే బయలుదేరడం ఉత్తమం," అని సీబీఎస్ఈ సూచించింది.
పరీక్ష రోజున ఎలాంటి గందరగోళం ఉండకుండా, విద్యార్థులు- తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించడం ఉత్తమం అని సీబీఎస్ఈ సూచించింది. ఫలితంగా రూట్పై అవగాహన వస్తుందని పేర్కొంది.
(HT_PRINT)
ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు రెండుసార్లు జరగనున్నాయి. మొదటిది అందరు కచ్చితంగా రాయాలి. రెండొవది ఆప్షనల్. ఇక 12వ తరగతి పరీక్షల దిద్దుబాటులో ఓఎస్ఎం (ఆన్-స్క్రీన్ మార్కింగ్) పద్ధతిని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. అంటే టీచర్లు 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయనున్నారు.
E-Paper

