330 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే బైక్ ఇది- ఇంధన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి!
పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్న వారు ఇది మిస్ అవ్వకూడదు. ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. మొత్తం 330 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే ఈ మోడల్ వివరాలు..
ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్లో 125 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సీటు కింద సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది. 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉండటం వల్ల ఇతర 125 సీసీ మోడళ్లతో పోల్చితే దీని బరవు కాస్త ఎక్కువ ఉంటుంది.
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో ప్రకారం.. ఈఫ్రీడమ్ 125 సాంప్రదాయ 125 సీసీ పెట్రోల్ బైక్స్తో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 50 శాతం వరకు తగ్గించగలదు.
సీఎన్జీ మోడ్లో నడుస్తున్నప్పుడు ఈ బైక్ 102 కి.మీ./కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఉపయోగించినప్పుడు 64 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుంది. ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఫ్రీడమ్ 125 కేవలం సీఎన్జీపై 200 కి.మీ.ల వరకు ప్రయాణించగలదని బజాజ్ ఆటో పేర్కొంది. పెట్రోల్ని కూడా కలుపుకుంటే అదనంగా 130 కి.మీలు, మొత్తం మీద 330 కి.మీ.ల వరకు కంబైన్డ్ మైలేజ్ లభిస్తుందని వెల్లడించింది.
ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ ఎక్స్షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా, NG04 డ్రమ్ వేరియంట్ ధరను సంస్థ ఇటీవలే రూ. 5వేలు తగ్గించింది.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్లో ఎల్ఈడీ హెడ్ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రేర్లో మోనోలింక్ సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అదనంగా, టాప్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సైతం ఉంటుంది. సీఎన్జీ సిలిండర్ ఉండటం వల్ల సీటు ఎత్తు 825 ఎంఎంకి చేరింది.
E-Paper

