కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ...! వచ్చే వారం నుంచే పంపిణీ, మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
ఏపీలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ఆగస్ట్ 25 నుంచి 31వ తేదీ వరకు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కార్డు అఫ్రూవ్ అయిన వాళ్లకు వీటిని పంపిణీ చేస్తారు. ముఖ్యమైన సమాచారం ఇక్కడ తెలుసుకోండి….
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో మీకు కార్డు మంజూరు అయిందా లేదా అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ ఏ స్టేజీలో డిస్ ప్లే అవుతుంది. ఇందులో అఫ్రూవ్ అని ఉంటే… మీ చేతికి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినట్లే..!
అయితే 65 సంవత్సరాలు పైబడిన వృద్దులకు, ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు 26 నుండి 30 వ తేదీ వరకు వారి ఇంటి వద్దే రేషన్ సరుకులను పంపిణీ చేస్తారు.
స్మార్టు కార్డులపై కుంటుంబ పెద్ద యొక్క ఫొటోతో పాటు సభ్యులు పేర్లు అన్ని ఆ కార్డులో పొందుపర్చడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టరుతోని అనుసందానం చేస్తారు. తద్వారా ట్రాన్జాక్షన్ జరుగగానే సెంట్రల్ ఆఫీసులో నమోదు అయ్యే విధంగా ఈ కార్డును రూపొందించారు.
ఈనెలలో కొత్త కార్డులు పొందే వారు.. వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి రేషన్ సరుకులను తీసుకోవచ్చు.ప్రతి నెలా 1 నుండి 15 వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు రేషన్ సరుకులు పంపణీ చేయడం జరుగుతుంది.
ఈనెలలో కొత్త కార్డులు పొందే వారు.. వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి రేషన్ సరుకులను తీసుకోవచ్చు.ప్రతి నెలా 1 నుండి 15 వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు రేషన్ సరుకులు పంపణీ చేయడం జరుగుతుంది.
కొత్త కార్డులతో కలుపుని రాష్ట్రంలోని రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 కు చేరుకుందని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వీటికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారు. ఇప్పటికే అర్హుల లిస్ట్ కూడా సిద్ధమైంది.
రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమం ఉంటుంది.రాష్ట్రంలోని రేషన్ లబ్దిదారుల సంఖ్య 4,29,79,897 కు చేరుకుంది.
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 25వ తేదీ నుంచి పంపిణీని ప్రారంభిస్తారుయ ఆగస్ట్ 31వ తేదీ వరకు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
E-Paper

