2 రకాలుగా కొత్త రేషన్ కార్డులు - పంపిణీకి ముహుర్తం ఫిక్స్...! ఈ కొత్త అప్డేట్స్ తెలుసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన వచ్చేసింది. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 2 రకాల కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి….
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు.
దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కొత్త కార్డులు మరియు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో.,… రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 94.72 లక్షలకు చేరిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. 3.10 కోట్ల మందికి లబ్ఘి చేరుకుతుందని చెప్పారు.
రాష్ట్రంలో కొత్త కార్డులు మరియు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో.,… రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 94.72 లక్షలకు చేరిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. 3.10 కోట్ల మందికి లబ్ఘి చేరుకుతుందని చెప్పారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కార్డు రానివాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్నవాళ్లు కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
జూలై 14వ తేదీన సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి సభా వేదిక పై నుంచి సీఎం రేవంత్ చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. అలాగే ప్రస్తుత కార్డులలో కుటుంబ సభ్యులను కూడా చేర్చుతున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు మంజూరైన కొత్త కార్డులతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు నెంబర్ లేదా మీసేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లో కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తాం. ఏపీఎల్ కుటుంబాలకు పచ్చ కార్డును ఇస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మొత్తం రెండు రకాల కార్డులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. సన్నబియ్యం ఇస్తుండటంతో… రేషన్ కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
E-Paper

