...
...
Next Story

Samarlakota Fire accident : సామర్లకోటలో భారీ పేలుడు - పెరుగుతున్న మృతుల సంఖ్య..! సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Samarlakota Fire accident : కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 నుంచి 20 మధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Published on: Feb 28, 2026 06:07 PM IST
Advertisement
<p>కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 నుంచి 20 మధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది.</p>

కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 నుంచి 20 మధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది.

ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 34 మంది పనిచేస్తున్నారు. వీరిలో 15 నుంచి 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు జరిగినప్పుడు ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకున్నప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఘటనాస్థలికి వచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో కాకినాడ జీజీహెచ్ కు తరలించినట్లు ప్రకటించారు.

ప్రాథమిక విచారణ ప్రకారం… బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం లేదా రసాయనాల మిశ్రమంలో జరిగిన పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని ట్వీట్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe