భక్తులకు శుభవార్త - శ్రీశైలంలో ‘ఉచిత స్పర్శ దర్శనం’, టైమింగ్స్ వివరాలివే
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది. జూలై 1 నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం ఈ అవకాశం కల్పిస్తారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
ఆలయ ఈవో వెల్లడించిన ప్రకటన వివరాల ప్రకారం…. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.
స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు.
శ్రీశైల ఆలయంలో జూలై ఒకటో తేదీ నుంచి ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు.
ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు.
ఎంపిక చేసిన కొన్ని పండుగలు , మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఈ స్పర్శ దర్శన సేవ ఉండదు అని దేవస్థానం వర్గాలు ప్రకటించాయి. ఇందులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నాయి.
ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఏ రోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేస్తారు. ఈ కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును ఎంట్రీ చేస్తారు.
E-Paper

