
గణేశ్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్ర! ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్లారు.
బిహార్ రాజధాని పట్నాలో గణపతి ప్రతిమల వద్ద ఓ మహిళా కస్టమర్.
వినాయక చవితి నేపథ్యంలో అసోం గువాహటీలోని లటసిల్ గణేశ్ ఆలయంలో సోమవారం భక్తులు ఇలా దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.
వినాయక చవితి వేళ ముంబైలోని ప్రపంచ ప్రఖ్యాత లాల్బాగ్చా రాజాకు ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.
దిల్లీ ఝందేవలాన్ ప్రాంతంలో వినాయకుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఒక ఆర్టిస్ట్.
దిల్లీలోని ఝందేవాలన్ మార్కెట్లో వినాయకుడి ప్రతిమలను కొనుగోలు చేస్తున్న ప్రజలు. దిల్లీలో సైతం ఈసారి గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
నోయిడాలో పరిస్థితి ఇది! ప్రజలు భారీ సంఖ్యలో వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నప్పుడు తీసిన ఫొటో.
గురుగ్రామ్లో గణపతిని మండపం వద్దకు తీసుకెళుతున్నప్పుడు కెమెరాకు చిక్కిన దృశ్యం.
నోయిడాలో గణపతి ప్రతిమతో ఓ మహిళ
హైదరాబాద్ ఖైరతాబాద్లోని 69 అడుగుల వినాయకుడి విగ్రహం. ఇది సెప్టెంబర్ 12న తీసిన ఫొటో..