...
...
Next Story

Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - తొలి ప్రమాద హెచ్చరిక జారీ!

Bhadrachalam Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Published on: Jul 31, 2026, 12:16:57 IST
Advertisement
<p>ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరద ప్రవాహం తీవ్రమవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల మార్కును తాకింది. </p><p> </p>

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరద ప్రవాహం తీవ్రమవ్వడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల మార్కును తాకింది.

నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా యంత్రాంగం మరియు నీటిపారుదల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంత వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ఉపశమన చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పరిణామాలు, నీటి ప్రవాహ వేగాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అత్యవసర సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. నదిలోకి ఎవరూ దిగవద్దని, మత్స్యకారులు మరియు స్థానికులు సాహసాలు చేయవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేసింది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా,అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడ తాగునీరు, ఆహారం, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe