
ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తరువాత న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ ప్రజలు ఇలా సంబరాలు చేసుకున్నారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత ప్రయాగ్రాజ్ ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
మహిళల ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిన తరువాత లక్నోలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి హర్షధ్వానాలు చేశారు.
భారతదేశ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు ఢిల్లీ ఇండియా గేట్ వద్ద బాణసంచా, జెండాలతో గుమిగూడారు.
ప్రపంచ కప్ లో టీమిండియా విజయం సాధించిన తరువాత లక్నోలోని హజ్రత్ గంజ్ క్రాసింగ్ వద్ద ప్రజలు సంబరాలు చేసుకున్నారు.