
చాలా కాలం తర్వాత ఆడుతున్న టెస్టు మ్యాచ్ లో ఇండియా అదరగొడుతోంది. శనివారం (జూన్ 6) అఫ్గానిస్థాన్ తో ప్రారంభమైన మ్యాచ్ లో ఫస్ట్ రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఇండియా 368/3తో డే 1ను ముగించింది.
ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి శుభ్ మన్ గిల్ 103 రన్స్ తో, రిషబ్ పంత్ 50 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.
యశస్వి జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలో దిగాడు. అతను 165 బంతుల్లో 100 పరుగులు చేశాడు. టెస్టుల్లో కేఎల్ కు ఇది 12వ సెంచరీ.
మూడో ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చిన సాయి సుదర్శన్ కూడా 81 పరుగులతో మంచి ప్రదర్శన ఇచ్చాడు, రాహుల్తో కలిసి రెండవ వికెట్ కోసం 139 పరుగులు జోడించాడు.
మహమ్మద్ సలీమ్ బౌలింగ్ లో ఒక సింగిల్తో శుభ్ మన్ తన 11వ టెస్టు శతకాన్ని సాధించాడు.
అఫ్గానిస్థాన్ తరపున మహమ్మద్ సలీమ్ డే 1లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు, అతను రెండు వికెట్లు సాధించాడు.