IND vs Pak : టీ20ల్లో పాకిస్థాన్పై ఇండియాదే పైచేయి.. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది?
బాయ్కాట్లు, యూ-టర్న్లు, గందరగోళం మధ్య 2026 టీ20 ప్రపంచకప్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు సంబంధించిన స్టాట్స్ని, వాతావరణ అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..
టీ20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ లైవ్ని చూడవచ్చు.
(Deepak Salvi)
టీ20ల్లో పాకిస్థాన్పై ఇండియాదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 16 మ్యాచులు జరగ్గా.. టీమిండియా 13సార్లు గెలిచింది. పాకిస్థాన్ కేవలం 3సార్లే విజయం సాధించింది. ఇది మన జట్టుకు ఆత్మవిశ్వాశాన్ని పెంచే విషయం. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఇండియా మొదటి స్థానంలో, పాకిస్థాన్ 6వ స్థానంలో ఉన్నాయి.
(HT_PRINT)
ఫ్యాన్స్కి ఆందోళనకర విషయం ఏంటంటే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కి వరుణుడి ముప్పు పొంచి ఉంది! కొలంబోలో ఉదయం భారీ వర్ష సూచన ఉంది. రాత్రి వేళ వర్ష ముప్పు కాస్త తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వెదర్ అప్డేట్స్ని ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
(PTI)
ఈసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్లో భాగంగా 3 విషయాలపై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. వాటిల్లో ఒకటి అభిషేక్ శర్మ. గత మ్యాచ్కి దూరమైన ఈ డాషింగ్ ఓపెనర్ పాక్తో మ్యాచ్ ఆడతాడో లేదో అని ఆందోళన ఉండేది. కానీ అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడుతున్నట్టు సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు. ఇక రెండోది.. ఉస్మాన్ తారిక్. ఈ మిస్టరీ బౌలర్ని టీమిండియా ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.
(PTI)
ఇక మూడోది.. హ్యాండ్షేక్ వ్యవహారం! ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు స్పోర్ట్స్ మీద కూడా పడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, గతేడాది జరిగిన ఆసియా కప్లో పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇచ్చేందుకు టీమిండియా నిరాకరించింది. అప్పట్లో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. “పాక్ ఆటగాళ్లకు ఈసారి హ్యాండ్షేక్ ఇస్తారా?” అని అడిగినప్పుడు.. “అది తెలియాలంటే మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే,” అని బదులిచ్చాడు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్.
E-Paper

