...
...
Next Story

Instants : ఫొటో షేరింగ్​కి కొత్త యాప్- ‘ఇన్​స్టంట్స్​’ ఎలా పనిచేస్తుందంటే..

సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ‘ఇన్‌స్టంట్స్’ పేరుతో ఒక కొత్త ఇమేజ్ షేరింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం స్నాప్‌చాట్ వంటి యాప్స్ అందిస్తున్న ఫీచర్లనే ఇది కూడా కలిగి ఉంది.

Published on: Apr 25, 2026, 11:18:54 IST
Advertisement
<p>సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫోటోలను అందంగా ఎడిట్ చేసి, ఫిల్టర్లు అద్ది పెడుతుంటాం. కానీ 'ఇన్‌స్టంట్స్' అందుకు భిన్నం. ఇది పూర్తిగా సహజమైన కంటెంట్‌ను షేర్ చేయడంపై దృష్టి పెడుతుంది.</p>

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫోటోలను అందంగా ఎడిట్ చేసి, ఫిల్టర్లు అద్ది పెడుతుంటాం. కానీ 'ఇన్‌స్టంట్స్' అందుకు భిన్నం. ఇది పూర్తిగా సహజమైన కంటెంట్‌ను షేర్ చేయడంపై దృష్టి పెడుతుంది.

ఈ యాప్ ద్వారా తీసిన ఫోటోలను ఎడిట్ చేయడం కుదరదు. ఫిల్టర్లు వాడటానికి వీలుండదు. కేవలం బేసిక్ టెక్స్ట్ మాత్రమే రాసుకోవచ్చు. మీ ఫోన్ గ్యాలరీలో ముందే ఉన్న ఫోటోలను ఇందులో షేర్ చేయలేరు. అప్పటికప్పుడు ఇన్-యాప్ కెమెరాతో ఫోటో తీసి మాత్రమే పంపాలి!

మీరు పంపిన ఫోటోలను అవతలి వారు ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఆ తర్వాత 24 గంటల లోపు అవి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. మీకు ఫాలో అయ్యే వారు, మీరు తిరిగి ఫాలో చేసే వారికి మాత్రమే ఫోటోలు పంపే వీలుంటుంది.

సోషల్ మీడియాలో 'పర్ఫెక్ట్' ఫోటోల కోసం యూజర్లు పడే ఒత్తిడిని తగ్గించడమే ఈ యాప్ ఉద్దేశమని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధి తెలిపారు. "యూజర్లు తమ స్నేహితులతో ఎటువంటి హంగులు లేని క్యాజువల్ ఫోటోలను పంచుకోవడానికి ఇదొక సులభమైన వేదిక," అని నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో కనిపిస్తున్నప్పటికీ, భారత్ వంటి మార్కెట్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. స్మాప్​చాట్​కి గట్టి పోటీ ఇచ్చే విధంగా రూపొందించిన ఈ యాప్.. త్వరలోనే మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఒక ఫీచర్‌గా కూడా వచ్చే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe